Rajnath Singh: రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh On Rahul Gandhi: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ సాయుధబలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నానని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో నందగఢ్ లో బీజేపీ ‘‘విజయ్ సంకల్ఫ్ యాత్ర’’ రెండో విడతను ప్రారంభించిన ఆయన, వచ్చే కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.
Read Also: First Night Video: హయ్ ఫ్రెండ్స్.. మా ఫస్ట్ నైట్ వీడియో షేర్ చేస్తున్నా.. లైక్ చేయండి
Also Read
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రారంభించేందుకే భారత్ జోడో యాత్ర ప్రారంభం అయిందని, జోడో యాత్రలో 1947లో విడిపోయిన భారత్ ను కలిపేందుకు ఆయన కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నా అంటూ వ్యాఖ్యానించారు. భారత్ ఏకంగా, సఖ్యతో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఈ యాత్రను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ప్రజలను పిచ్చోళ్లను చేసి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరని అన్నారు. ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే వారిని ప్రజలు ఆదరిస్తారని అన్నారు. అది బీజేపీ మాత్రమే చేయగలదని అన్నారు.
ప్రధాని మోదీకి ‘‘సమాధి తవ్వుతాం’’ అని విమర్శలు చేస్తున్నారు, కానీ వారు వారి సమాధినే తవ్వుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. బీజేపీ, ప్రధానిమోదీపై ఎంత బురదజల్లితే అంతగా కమలం వికసిస్తుందని అన్నారు. రక్షణ మంత్రిగా నేను మన సైనిక బలగాల ధైర్యసాహసాలు చూసి గర్వపడుతున్నానని అన్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని, మేఘాలయాలో బీజేపీ సీట్లు పెరిగాయని, మూడింట రెండొంతుల మెజారిటీతో కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని రాజ్ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఎప్పుడూ మాటపై నిలబడుతుందని, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు వంటివి తీసుకువచ్చామని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!