JP Nadda: “సమాజానికి న్యాయం చేయని వాళ్లే”.. రాహుల్ యాత్రపై జేపీ నడ్డా ఫైర్
JP Nadda: రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత న్యాయ యాత్ర’పై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. సమాజానికి న్యాయం చేయని వాళ్లు ఇప్పుడు ‘న్యాయ యాత్ర’ గురించి ఆలోచిస్తున్నారంటూ ఆదివారం విమర్శించారు. లక్నోలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశిస్తూ.. ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇండియా కూటమి దేశాన్ని కిందికి లాగేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.
Read Also: Uttar Pradesh: యూపీలో అమానుషం.. కట్నం డబ్బులు తీసుకురాలేదని మహిళను వివస్త్రను చేశారు..
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలను ప్రచారం చేసేందుకు బీజేపీ ‘విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ చేపట్టింది. దీంట్లో పాల్గొనేందుకు నడ్డా యూపీ వచ్చారు. చాలా ఏళ్లుగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు ‘భారత్ జోడో యాత్ర’ను చేశారని, ఇప్పుడు సమాజానికి ఎలాంటి న్యాయం చేయని వ్యక్తులు ‘న్యాయ యాత్ర’ నిర్వహించాలని ఆలోచిస్తున్నారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటే.. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రధాని మోడీ మహిళలు, రైతులు, యువత, పేదలు అనే నాలుగు కులాలను మాత్రమే చూస్తున్నారని, వీరిని బలోపేతం చేస్తే దేశం బలోపేతం అవుతుందని అన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ని గుండాల రాష్ట్రంగా పిలిచే వారిని, కానీ ఇప్పుడు మోడీ, యోగి నేతృత్వంలో అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని నడ్డా అన్నారు.
గతేడాది కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. దీనికి రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ యాత్ర జరిగింది. జనవరి 14 నుంచి ‘భారత్ న్యాయ్ యాత్ర’కి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 67 రోజుల పాటు 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల గుండా ఈ యాత్ర జరగనుంది. 2024 లోక్సభ ఎన్నిలక ముందు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేందుకు హైబ్రీడ్ మోడ్లో రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. మణిపూర్ రాష్ట్రంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర ముంబై వరకు 6200 కిలోమీటర్ల మేర సాగనుంది.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!