BJP: రాహుల్గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది.
అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన నివాస ప్రాంగణాల్లోనే భారీగా డబ్బు బటయపడుతుండటంతో బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ అమిత్ మాలవీయ శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీతో, ధీరజ్ సాహు ఉన్న వీడియోని ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Success Story: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ ‘నిషా జగ్తియాని’?
‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిజానికి భారతదేశ దొంగలను కలిపే యాత్ర. కాంగ్రెస్ అంటే #CorruptionKiDukan. జార్ఖండ్లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో దాదాపు రూ. 300 కోట్లు రికవరీ కావడమే దీనికి సజీవ సాక్ష్యం.’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు అంతర్జాతీయ అవినీతి దినోత్సం, ఈ రోజు కరప్షన్ దుకాణం యజమాని పుట్టినరోజు కూడా, ఇది కేవలం యాదృచ్చికం’’ అంటూ పరోక్షంగా డిసెంబర్ 9 సోనియాగాంధీ తన పుట్టిన రోజు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
ఒడిశా, జార్ఖండ్ లోని ధీరజ్ సాహు ప్రాంగణంలో శనివారం పన్ను దాడులు కొనసాగాయి. ఇప్పటి వరకు రూ. 200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు బయటపడింది. శనివారం ఉదయం ఐటీ శాఖ రాంచీలోని ధీరజ్ సాహు ప్రాంగణంలో మరిన్ని బ్యాగుల్ని స్వాధీనం చేసుకోగా.. ఆ ప్రాంతంలో మద్యం ఫ్యాక్టరీల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న బంటీ సాహు ఇంట్లో 19 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
राहुल गांधी की भारत जोड़ो यात्रा दरअसल भारत के चोरों को जोड़ने की यात्रा थी। कांग्रेस #CorruptionKiDukan है। झारखंड में कांग्रेस के राज्यसभा सांसद धीरज साहू के ठिकानों से बरामद लगभग 300 करोड़ रुपए इसका जीता-जागता प्रमाण है। pic.twitter.com/Sc7Pt2D7ZV
— Amit Malviya (@amitmalviya) December 9, 2023
తాజావార్తలు
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!