BJP: రాహుల్గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది.
అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన నివాస ప్రాంగణాల్లోనే భారీగా డబ్బు బటయపడుతుండటంతో బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ అమిత్ మాలవీయ శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీతో, ధీరజ్ సాహు ఉన్న వీడియోని ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: Success Story: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ ‘నిషా జగ్తియాని’?
‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిజానికి భారతదేశ దొంగలను కలిపే యాత్ర. కాంగ్రెస్ అంటే #CorruptionKiDukan. జార్ఖండ్లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో దాదాపు రూ. 300 కోట్లు రికవరీ కావడమే దీనికి సజీవ సాక్ష్యం.’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు అంతర్జాతీయ అవినీతి దినోత్సం, ఈ రోజు కరప్షన్ దుకాణం యజమాని పుట్టినరోజు కూడా, ఇది కేవలం యాదృచ్చికం’’ అంటూ పరోక్షంగా డిసెంబర్ 9 సోనియాగాంధీ తన పుట్టిన రోజు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
ఒడిశా, జార్ఖండ్ లోని ధీరజ్ సాహు ప్రాంగణంలో శనివారం పన్ను దాడులు కొనసాగాయి. ఇప్పటి వరకు రూ. 200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు బయటపడింది. శనివారం ఉదయం ఐటీ శాఖ రాంచీలోని ధీరజ్ సాహు ప్రాంగణంలో మరిన్ని బ్యాగుల్ని స్వాధీనం చేసుకోగా.. ఆ ప్రాంతంలో మద్యం ఫ్యాక్టరీల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న బంటీ సాహు ఇంట్లో 19 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
राहुल गांधी की भारत जोड़ो यात्रा दरअसल भारत के चोरों को जोड़ने की यात्रा थी। कांग्रेस #CorruptionKiDukan है। झारखंड में कांग्रेस के राज्यसभा सांसद धीरज साहू के ठिकानों से बरामद लगभग 300 करोड़ रुपए इसका जीता-जागता प्रमाण है। pic.twitter.com/Sc7Pt2D7ZV
— Amit Malviya (@amitmalviya) December 9, 2023
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?