BJP: రాహుల్గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది.
అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన నివాస ప్రాంగణాల్లోనే భారీగా డబ్బు బటయపడుతుండటంతో బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ అమిత్ మాలవీయ శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీతో, ధీరజ్ సాహు ఉన్న వీడియోని ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు.
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
Read Also: Success Story: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ ‘నిషా జగ్తియాని’?
‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిజానికి భారతదేశ దొంగలను కలిపే యాత్ర. కాంగ్రెస్ అంటే #CorruptionKiDukan. జార్ఖండ్లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో దాదాపు రూ. 300 కోట్లు రికవరీ కావడమే దీనికి సజీవ సాక్ష్యం.’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు అంతర్జాతీయ అవినీతి దినోత్సం, ఈ రోజు కరప్షన్ దుకాణం యజమాని పుట్టినరోజు కూడా, ఇది కేవలం యాదృచ్చికం’’ అంటూ పరోక్షంగా డిసెంబర్ 9 సోనియాగాంధీ తన పుట్టిన రోజు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
ఒడిశా, జార్ఖండ్ లోని ధీరజ్ సాహు ప్రాంగణంలో శనివారం పన్ను దాడులు కొనసాగాయి. ఇప్పటి వరకు రూ. 200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు బయటపడింది. శనివారం ఉదయం ఐటీ శాఖ రాంచీలోని ధీరజ్ సాహు ప్రాంగణంలో మరిన్ని బ్యాగుల్ని స్వాధీనం చేసుకోగా.. ఆ ప్రాంతంలో మద్యం ఫ్యాక్టరీల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న బంటీ సాహు ఇంట్లో 19 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
राहुल गांधी की भारत जोड़ो यात्रा दरअसल भारत के चोरों को जोड़ने की यात्रा थी। कांग्रेस #CorruptionKiDukan है। झारखंड में कांग्रेस के राज्यसभा सांसद धीरज साहू के ठिकानों से बरामद लगभग 300 करोड़ रुपए इसका जीता-जागता प्रमाण है। pic.twitter.com/Sc7Pt2D7ZV
— Amit Malviya (@amitmalviya) December 9, 2023
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!