Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News They Want To Tease People Pm Vs Opposition On Non Veg Food

PM Modi: శ్రావణంలో మటన్ తింటూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు.. రాహుల్, లాలూపై విమర్శలు..

Published Date :April 12, 2024 , 5:59 pm
By Venu Goapl Reddy
PM Modi: శ్రావణంలో మటన్ తింటూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు.. రాహుల్, లాలూపై విమర్శలు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ప్రతిపక్ష పార్టీలు, నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. నవరాత్రి సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేపల్ని తిన్నాడన్న వివాదం నేపథ్యంలో శుక్రవారం మోడీ వారిపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, నిర్ధిష్ట ఓట్ బ్యాంక్ కోసం పాటుపడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. దేశంలోని మెజారిటీ జనాభా మనోభావాల గురించి వారికి పట్టింపు లేదని, తేజస్వీ యాదవ్ పోస్టు చేసిన వీడియో గురించి పరోక్షంగా ప్రస్తావించారు. నవరాత్రి ప్రారంభానికి ముందు తేజస్వీ యాదవ్ ఓ వీడియోను పోస్ట్ చేసి, ప్రజలు ఏం తింటున్నారు..? ఏం ధరిస్తున్నారు..? అనే విషయాల్లో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, ప్రజలకు కోసం ఏం చేయడం లేదని ఆరోపించారు.

ఈ రోజు జమ్మూకాశ్మీర్ ఉదంపూర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ విపక్ష నాయకులపై ఫైర్ అయ్యారు. గతేడాది సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ వండుకుని తిన్న వీడియో గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. దేశంలో చాలా మంది ప్రజల మనోభావాల గురించి పట్టించుకోకుండా, పవిత్ర శ్రావణ మాసంలో దోషిగా తేలిన వ్యక్తి ఇంటికి వెళ్లి మటన్ వండుకున్నారని, దేశ ప్రజల్ని ఆటపట్టిస్తున్నారంటూ రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్‌లపై ఫైర్ అయ్యారు.

Also Read

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
  • MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
  • Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
  • Vijay's Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
Add as a preferred
source on google

Read Also: Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్‌పై దాడి చేయబోతున్న ఇరాన్..

‘‘చట్టం ఎవరిని ఏమి తినకుండా ఆపలేదు, మోడీ కూడా అలా చేయడు, కానీ వారి ఉద్దేశం వేరుగా ఉంది. మొఘలులు దాడి చేసినప్పుడు, రాజును ఒంటరిగా చేసి ఓడించినందుకు వారు తృప్తి చెందలేదు. దేవాలయాలను ధ్వంసం చేసే వరకు వారికి సంతృప్తి లేదు. అదే విధంగా శ్రావణ మాసంలో వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా వారు(ప్రతిపక్షాలు) మొఘల్ కాలం నాటి ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నారు. ప్రజలను మనోభావాలను దెబ్బతీసేందుకు, వారి ఓటు బ్యాంకును బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని ప్రధాని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఎవరిని సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు.

ఈ విధంగా మాట్లాడినందుకు వారు తనపై దుష్ఫ్రచారం చేస్తారని తెలుసు, కానీ ప్రజలకు ఏది సరైనదో చెప్పడం ప్రజాస్వామ్యంలో నా కర్తవ్యమని, వారు ఉద్దేశపూర్వకంగా విశ్వాసాలపై దాడి చేస్తున్నారని, దీని వల్ల దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని, వారు బుజ్జగింపు రాజకీయాల్లో మించిపోయారని, మొగలుల ఆలోచనల్ని రుజువు చేస్తున్నారని ప్రధాని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lalu Prasad Yadav
  • Lok Sabha elections-2024
  • Non-Veg Food
  • PM Modi
  • rahul gandhi

తాజావార్తలు

  • Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions