PM Modi: శ్రావణంలో మటన్ తింటూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు.. రాహుల్, లాలూపై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ప్రతిపక్ష పార్టీలు, నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. నవరాత్రి సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేపల్ని తిన్నాడన్న వివాదం నేపథ్యంలో శుక్రవారం మోడీ వారిపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, నిర్ధిష్ట ఓట్ బ్యాంక్ కోసం పాటుపడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. దేశంలోని మెజారిటీ జనాభా మనోభావాల గురించి వారికి పట్టింపు లేదని, తేజస్వీ యాదవ్ పోస్టు చేసిన వీడియో గురించి పరోక్షంగా ప్రస్తావించారు. నవరాత్రి ప్రారంభానికి ముందు తేజస్వీ యాదవ్ ఓ వీడియోను పోస్ట్ చేసి, ప్రజలు ఏం తింటున్నారు..? ఏం ధరిస్తున్నారు..? అనే విషయాల్లో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, ప్రజలకు కోసం ఏం చేయడం లేదని ఆరోపించారు.
ఈ రోజు జమ్మూకాశ్మీర్ ఉదంపూర్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ విపక్ష నాయకులపై ఫైర్ అయ్యారు. గతేడాది సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ వండుకుని తిన్న వీడియో గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. దేశంలో చాలా మంది ప్రజల మనోభావాల గురించి పట్టించుకోకుండా, పవిత్ర శ్రావణ మాసంలో దోషిగా తేలిన వ్యక్తి ఇంటికి వెళ్లి మటన్ వండుకున్నారని, దేశ ప్రజల్ని ఆటపట్టిస్తున్నారంటూ రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్లపై ఫైర్ అయ్యారు.
Also Read
Read Also: Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్పై దాడి చేయబోతున్న ఇరాన్..
‘‘చట్టం ఎవరిని ఏమి తినకుండా ఆపలేదు, మోడీ కూడా అలా చేయడు, కానీ వారి ఉద్దేశం వేరుగా ఉంది. మొఘలులు దాడి చేసినప్పుడు, రాజును ఒంటరిగా చేసి ఓడించినందుకు వారు తృప్తి చెందలేదు. దేవాలయాలను ధ్వంసం చేసే వరకు వారికి సంతృప్తి లేదు. అదే విధంగా శ్రావణ మాసంలో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా వారు(ప్రతిపక్షాలు) మొఘల్ కాలం నాటి ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నారు. ప్రజలను మనోభావాలను దెబ్బతీసేందుకు, వారి ఓటు బ్యాంకును బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని ప్రధాని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఎవరిని సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు.
ఈ విధంగా మాట్లాడినందుకు వారు తనపై దుష్ఫ్రచారం చేస్తారని తెలుసు, కానీ ప్రజలకు ఏది సరైనదో చెప్పడం ప్రజాస్వామ్యంలో నా కర్తవ్యమని, వారు ఉద్దేశపూర్వకంగా విశ్వాసాలపై దాడి చేస్తున్నారని, దీని వల్ల దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని, వారు బుజ్జగింపు రాజకీయాల్లో మించిపోయారని, మొగలుల ఆలోచనల్ని రుజువు చేస్తున్నారని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!