Supreme Court: మణిపూర్ మహిళల వేధింపు వీడియో కేసు.. నేడు విచారించనున్న సుప్రీం కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: మణిపూర్లో మహిళలపై వేధింపు వీడియో బయటికి రావడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై కేంద్రం సీబీఐతో విచారణ చేపట్టడానికి ఆదేశించింది. ముఖ్యంగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించబోమని కేంద్రం స్పష్టం చేసింది. కేసు విచారణనే మణిపూర్ వెలుపలా నిర్వహించాలని.. అదీ కాలపరిమితిలో పూర్తయ్యేలా విచారించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. మణిపూర్లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును నేడు విచారణ చేపట్టనుంది.
ఉంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. నిన్న గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.
Read also: Captain Miller Teaser: ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ వచ్చేసింది.. ధనుష్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోలా!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హోం శాఖ వెల్లడినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు ట్రయల్ కాలపరిమితితో(ఆరు నెలల గడువు) జరగాలని.. అదీ మణిపూర్ వెలుపలే జరగాలని అఫిడవిట్లో సుప్రీంను కోరింది. కేంద్రం మాత్రం దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవుతుందని నమ్ముతోంది. అయితే విచారణ మాత్రం కాలపరిమితితో పూర్తి కావాలని, ఆ విచారణ మణిపూర్ వెలుపలే జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కేంద్ర హోం శాఖ కోరింది. శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అయినా.. కేంద్రం తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సదరు అఫిడవిట్లో స్పష్టం చేశారు. లైంగిక దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చాక.. కేంద్రం ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షిస్తోందని తెలియజేసింది. దీంతో నేటి విచారణలో కేంద్రం అఫిడవిట్పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది.
Read also: Mahalakshmi Stotras: మహా సంపదలు మీ సొంతం శుక్రవారం ఈ స్తోత్రం వినండి
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా ద్వారా మణిపూర్ వైరల్ వీడియోను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది . జులై 20వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం .. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ఉద్దేశిస్తూ.. ‘‘యావత్ దేశమే కాదు.. ఈ న్యాయస్థానాన్ని ఆ వీడియో బాధించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి. ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే మేమే రంగంలోకి దిగుతామ’’ని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. నేటి(జులై 28)కి విచారణ వాయిదా వేసింది. నేడు సుప్రీంకోర్టు విచారణను చేపట్టనుంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!