కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ప్రజలకు రైల్వే శాఖ నుంచి ఒక శుభవార్త వచ్చింది. కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్య వస్తం అయింది. కొన్ని నింబంధనలతో ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. ప్రజా రవాణాలో అతి ముఖ్యమైనది భారతీయ రైల్వేలు. ఇప్పుడు ప్రజలకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీపి కబురు అందించారు. త్వరలోనే టిక్కెట్ ధరలను తగ్గించనున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం 30శాతం అధిక ధరలతో నడుస్తున్న రైళ్లను త్వరలో రద్దు చేసి రెగ్యూలర్ రైళ్లను తీసుకోస్తామన్నారు. రానున్న 2 నెలల్లో టికెట్ ధరలు తగ్గడంతో పాటు రైల్వే సేవలు మొత్తం సాధారణ స్థితికి వస్తా యని ఆయన పేర్కొన్నారు. అయితే దీనికోసం ప్రయాణికులు ఇంకా రెండు నెలలు ఎదురు చూడాల్సిందే.. రైల్వే శాఖ కూడా పరిమిత సంఖ్యలోనే అధిక ధరలతో రైళ్లను నడుపుతుంది. దీంతో అత్యవ సరం అయితే తప్ప జనాలు ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. కాగా కరోనా కారణంగా రైళ్లు నిలిచిపోగా ప్రత్యేకం పేరుతో రైల్వే శాఖ కొన్ని రైళ్లను నడుపుతుంది.