పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో అమరీందర్ పొత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయనున్నట్టు ఆయన బీజేపీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ఈ కూటమిలో మాజీ కేంద్ర మంత్రి సుఖ్దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని SAD (డెమోక్రటిక్) వంటి ఇతర పార్టీలు చేరే అవకాశం ఉంది. బీజేపీ పంజాబ్ ఇన్చార్జ్, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల మొదట్లో చండీగఢ్లో ఇరువురు నేతల భేటీ తర్వాత ఇది రెండోసారి. సీట్ల పంపకానికి సంబంధించిన వివరాలను తగిన సమయంలో ప్రకటిస్తామని షెకావత్ తెలిపారు.
ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా 101 శాతం విజయం సాధిస్తుందని సింగ్ అన్నారు. అమరిందర్సింగ్, షెకావత్ నివాసం నుండి బయలుదేరిన వెంటనే, మాజీ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదళ్ (డెమోక్రటిక్) అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ ధిండా బీజేపీ పంజాబ్ ఇన్ఛార్జ్ని కలవడానికి వచ్చారు. ధిండాకు చెందిన SAD (డెమోక్రటిక్) కూడా కూటమిలో భాగమవుతుందని వర్గాలు తెలిపాయి.
Also Read
Read Also: బీసీసీఐ-కోహ్లీ మధ్య ముదురుతున్న వివాదం…
మరికొన్ని చిన్న పార్టీలు కూడా చేరే అవకాశం ఉందన్నారు. 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీ లో SAD జూనియర్ భాగస్వామిగా 23 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినప్పటికీ, బీజేపీ ఈసారి సగానికి పైగా సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. పంజాబ్లో ఎన్నికలు పంచముఖ పోరుగా మారబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఎస్ఎడీ, ఆప్తో పాటు వివిధ రైతు సంఘాలు కూడా రంగంలోకి దిగవచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. అమరీందర్ సింగ్తో పొత్తుతో సిక్కులు మెజార్టీగా ఉన్న రాష్ర్టంలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!