Modi-Priyanka Gandhi: మోడీకి నవ్వు తెప్పించిన ప్రియాంకాగాంధీ స్టోరీ.. అసలేం జరిగిందంటే..!
- శుక్రవారం ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- చివరిలో సభ్యులకు టీ పార్టీ ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ
- మోడీకి నవ్వు తెప్పించిన ప్రియాంకాగాంధీ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఎంత హాట్హాట్గా సాగాయో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 1న ప్రారంభమైన దగ్గర నుంచి విపక్ష సభ్యులంతా సభలో గందరగోళం సృష్టిస్తూనే ఉన్నారు. చివరికి ఢిల్లీ కాలుష్యంపై చర్చ లేకుండానే సమావేశాలు ముగియడం ఆశ్చర్యం.

Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
ఇదిలా ఉంటే సమావేశాల ముగింపు రోజున సంప్రదాయంగా ప్రధాని టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. గురువారం ‘జీ-రామ్-జీ’ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నానాయాగీ చేశారు. ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. కానీ అంతలోనే ప్రధాని మోడీ ఇచ్చిన టీ పార్టీకి హాజరై ఉల్లాసంగా గడిపారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మన్ పర్యటనలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ హాజరయ్యారు.

లోక్సభ స్పీకర్, ప్రధాని మోడీ ఒక సోఫాలో కూర్చోగా… రాజ్నాథ్సింగ్, ప్రియాంకాగాంధీ ఒక సోఫాలో కూర్చున్నారు. మిగతా అధికార-ప్రతిపక్ష సభ్యులంతా వేర్వేరు చోట్ల కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ ఆసక్తికర స్టోరీ చెప్పారు. అలెర్జీలను తగ్గించుకునేందుకు తన నియోజకవర్గమైన వయనాడ్ నుంచి ఒక మూలికను తీసుకొచ్చి వాడుతుంటానని ప్రియాంకాగాంధీ పంచుకున్నారు. దీంతో ప్రధాని మోడీ, రాజ్నాథ్సింగ్ సహా ఎంపీలంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మోడీ, రాజ్నాథ్సింగ్ నవ్వుతూ ఫొటోల్లో కనిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 3 దేశాల పర్యటన గురించి ప్రియాంకాగాంధీ ఆరా తీసినట్లు సమాచారం. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ పర్యటనలు బాగా జరిగినట్లుగా ప్రధాని బదులిచ్చినట్లు తెలుస్తోంది. 20 నిమిషాల పాటు జరిగిన సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ టీ పార్టీని బహిష్కరించగా.. అందుకు భిన్నంగా ప్రియాంకాగాంధీ హాజరై వార్తల్లో నిలిచారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!