Modi-Priyanka Gandhi: మోడీకి నవ్వు తెప్పించిన ప్రియాంకాగాంధీ స్టోరీ.. అసలేం జరిగిందంటే..!
- శుక్రవారం ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- చివరిలో సభ్యులకు టీ పార్టీ ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ
- మోడీకి నవ్వు తెప్పించిన ప్రియాంకాగాంధీ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఎంత హాట్హాట్గా సాగాయో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 1న ప్రారంభమైన దగ్గర నుంచి విపక్ష సభ్యులంతా సభలో గందరగోళం సృష్టిస్తూనే ఉన్నారు. చివరికి ఢిల్లీ కాలుష్యంపై చర్చ లేకుండానే సమావేశాలు ముగియడం ఆశ్చర్యం.

Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ఇదిలా ఉంటే సమావేశాల ముగింపు రోజున సంప్రదాయంగా ప్రధాని టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. గురువారం ‘జీ-రామ్-జీ’ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నానాయాగీ చేశారు. ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. కానీ అంతలోనే ప్రధాని మోడీ ఇచ్చిన టీ పార్టీకి హాజరై ఉల్లాసంగా గడిపారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మన్ పర్యటనలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ హాజరయ్యారు.

లోక్సభ స్పీకర్, ప్రధాని మోడీ ఒక సోఫాలో కూర్చోగా… రాజ్నాథ్సింగ్, ప్రియాంకాగాంధీ ఒక సోఫాలో కూర్చున్నారు. మిగతా అధికార-ప్రతిపక్ష సభ్యులంతా వేర్వేరు చోట్ల కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ ఆసక్తికర స్టోరీ చెప్పారు. అలెర్జీలను తగ్గించుకునేందుకు తన నియోజకవర్గమైన వయనాడ్ నుంచి ఒక మూలికను తీసుకొచ్చి వాడుతుంటానని ప్రియాంకాగాంధీ పంచుకున్నారు. దీంతో ప్రధాని మోడీ, రాజ్నాథ్సింగ్ సహా ఎంపీలంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మోడీ, రాజ్నాథ్సింగ్ నవ్వుతూ ఫొటోల్లో కనిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 3 దేశాల పర్యటన గురించి ప్రియాంకాగాంధీ ఆరా తీసినట్లు సమాచారం. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ పర్యటనలు బాగా జరిగినట్లుగా ప్రధాని బదులిచ్చినట్లు తెలుస్తోంది. 20 నిమిషాల పాటు జరిగిన సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ టీ పార్టీని బహిష్కరించగా.. అందుకు భిన్నంగా ప్రియాంకాగాంధీ హాజరై వార్తల్లో నిలిచారు.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!