Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఏమైంది..?
- మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని ముస్లిం ఓట్లు..
- ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లలో బీజేపీ కూటమి మెజారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Election Results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి( మహా వికాస్ అఘాడీ) కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ ఏకంగా 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే ఈ ఎన్ని్కల్లో ముస్లిం అధిక్యత ఉన్న 38 సీట్లలో బీజేపీ కూటమి ఏకంగా 22 స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష కూటమి 13 సీట్లను కైవసం చేసుంది. ఈ 38 సీట్లలో ముస్లిం జనాభా 20 శాతానికి పైగా ఉంది.
ఓట్ల చీలిక కాంగ్రెస్ని తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఆ పార్టీకి గతంలో 11 సీట్లు ఉంటే, ప్రస్తుతం 05 సీట్లను గెలుచుకుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఆరు సీట్లు, శరద్ పవార్ ఎన్సీపీకి 2 సీట్లు వచ్చాయి. 2019లో బీజేపీకి 11 సీట్లు ఉంటే, ఇప్పుడు 14 సీట్లకు పెంచుకుంది. ఏక్నాథ్ షిండే శివసేన 06, అజిత్ పవార్ ఎన్సీపీ 02 సీట్లను గెలుచుకుంది. మిగిలిన మూడు సీట్లలో సమాజ్వాదీ(ఎస్పీ) రెండు, ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Read Also: Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత
ముస్లింలు ఈ సారి గంపగుత్తగా కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని మత నాయకులు పిలుపునిచ్చారు. అయినప్పటికీ, ఈ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి సత్తా చాటలేకపోయింది. ముస్లిం ఓట్ల ఏకీకరణకు వ్యతిరేకంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ పెరిగినట్లు, ఇది బీజేపీకి లాభించినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ సీనియర్ నేత విజయ్ సహస్రబుద్ధే మాట్లాడుతూ.. ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని, అభివృద్ధికి ప్రజలు ఓటేశారని చెప్పారు. కాంగ్రెస్ బుజ్జగింపులు పనిచేయలేదని అన్నారు.
ఓడిపోయిన కీలకమైన ముస్లిం నేతల్లో ఎన్సీపీ నేతలు నవాబ్ మాలిక్, జీషన్ సిద్ధికీ, కాంగ్రెస్ నేత ఆరిఫ్ నసీమ్ ఖాన్, ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ఉన్నారు. ఇక ఎంఐఎం మాలేగావ్ సెంట్రల్లో మాత్రమే గెలిచింది. కేవలం 162 ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి ముఫ్తీ ఇస్మాయిల్ గెలిచారు. భివాండీ వెస్ట్లో ముస్లింల ఓట్లు ఎంఐఎం నేత వారిస్ పఠాన్, స్వతంత్ర అభ్యర్థి విలాస్ పాటిల్ మధ్య చీలిపోయాయి. ఫలితంగా బీజేపీ నేత రియాజ్ అజ్మీపై బీజేపీ అభ్యర్థి మహేష్ చౌగులే విజయం సాధించారు.
తాజావార్తలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..