Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఏమైంది..?
- మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని ముస్లిం ఓట్లు..
- ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లలో బీజేపీ కూటమి మెజారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Election Results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి( మహా వికాస్ అఘాడీ) కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ ఏకంగా 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే ఈ ఎన్ని్కల్లో ముస్లిం అధిక్యత ఉన్న 38 సీట్లలో బీజేపీ కూటమి ఏకంగా 22 స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష కూటమి 13 సీట్లను కైవసం చేసుంది. ఈ 38 సీట్లలో ముస్లిం జనాభా 20 శాతానికి పైగా ఉంది.
ఓట్ల చీలిక కాంగ్రెస్ని తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఆ పార్టీకి గతంలో 11 సీట్లు ఉంటే, ప్రస్తుతం 05 సీట్లను గెలుచుకుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఆరు సీట్లు, శరద్ పవార్ ఎన్సీపీకి 2 సీట్లు వచ్చాయి. 2019లో బీజేపీకి 11 సీట్లు ఉంటే, ఇప్పుడు 14 సీట్లకు పెంచుకుంది. ఏక్నాథ్ షిండే శివసేన 06, అజిత్ పవార్ ఎన్సీపీ 02 సీట్లను గెలుచుకుంది. మిగిలిన మూడు సీట్లలో సమాజ్వాదీ(ఎస్పీ) రెండు, ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత
ముస్లింలు ఈ సారి గంపగుత్తగా కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని మత నాయకులు పిలుపునిచ్చారు. అయినప్పటికీ, ఈ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి సత్తా చాటలేకపోయింది. ముస్లిం ఓట్ల ఏకీకరణకు వ్యతిరేకంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ పెరిగినట్లు, ఇది బీజేపీకి లాభించినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ సీనియర్ నేత విజయ్ సహస్రబుద్ధే మాట్లాడుతూ.. ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని, అభివృద్ధికి ప్రజలు ఓటేశారని చెప్పారు. కాంగ్రెస్ బుజ్జగింపులు పనిచేయలేదని అన్నారు.
ఓడిపోయిన కీలకమైన ముస్లిం నేతల్లో ఎన్సీపీ నేతలు నవాబ్ మాలిక్, జీషన్ సిద్ధికీ, కాంగ్రెస్ నేత ఆరిఫ్ నసీమ్ ఖాన్, ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ఉన్నారు. ఇక ఎంఐఎం మాలేగావ్ సెంట్రల్లో మాత్రమే గెలిచింది. కేవలం 162 ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి ముఫ్తీ ఇస్మాయిల్ గెలిచారు. భివాండీ వెస్ట్లో ముస్లింల ఓట్లు ఎంఐఎం నేత వారిస్ పఠాన్, స్వతంత్ర అభ్యర్థి విలాస్ పాటిల్ మధ్య చీలిపోయాయి. ఫలితంగా బీజేపీ నేత రియాజ్ అజ్మీపై బీజేపీ అభ్యర్థి మహేష్ చౌగులే విజయం సాధించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!