అసోం-మిజోరం మధ్య చల్లారని సరిహద్దు వివాదం
అసోం-మిజోరం మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. ఇరు రాష్ట్రాలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇంచు భూమి వదులుకునేది లేదంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెబుతున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాయి. ఆరు కంపెనీలకు చెందిన సీఆర్పీఎఫ్ బలగాలు.. 306 జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. సరిహద్దు ఘర్షణలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Also Read
మిజోరం వెళ్లొద్దని.. తమ పౌరులకు సూచించారు అసోం సీఎం హిమాంత బిశ్వ. సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారే వరకు ఆ రాష్ట్రానికి ప్రయాణాలను నిలిపివేసుకోవాలని సూచించారు. మిజోరం ప్రభుత్వ వ్యవహారశైలితోనే బోర్డర్ వివాదం తలెత్తిందని అసోం ఆరోపిస్తోంది. మరోవైపు సరిహద్దు జిల్లాలను నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించింది మిజోరం. ఉద్రిక్త ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది. మరోవైపు బోర్డర్ ఇష్యూ.. కేసులు, నోటీసుల వరకు వెళ్లింది. సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెంచేలా వ్యవహరించారని ఆరోపిస్తూ.. అసోం పోలీసులు మిజోరాం ఎంపీ వన్లాల్వెనకు నోటీసులు జారీ చేశారు. ఆగష్టు ఒకటిన విచారణకు రావాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో