Thackeray Memorial purified: బాల్ థాక్రే సమాధి వద్ద నివాళులర్పించిన ఏక్నాథ్ షిండే.. గోమూత్రంతో శుద్ధి చేసిన శివసేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thackeray Memorial purified: మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేకి నమ్మకస్తుండి.. తన కేబినెట్లో మంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే.. బయటకు వెళ్లిపోవడమే కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలను సైతం తన వెంట తీసుకెళ్లాడు.. దీంతో ఉద్ధవ్ సర్కార్ కూలిపోయింది.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.. దీంతో, షిండేను వెనక ఉండి నడిపించింది మొత్తం భారతీయ జనతా పార్టీయేనని స్పష్టమైపోయింది.. ఇక, అప్పటి నుంచి శివసేనలో వర్గపోరు నడుస్తూనే ఉంది.. పార్టీ పేరు, సింబల్ విషయంలోనూ న్యాయపోరాటం చేస్తున్నాయి రెండు వర్గాలు.. ఇప్పుడు శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Read Also: Botsa Satyanarayana: తథాస్తు.. చంద్రబాబు కోరిక తప్పకుండా నెరవేరుతుంది
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ఇక, అసలు విషయానికి వస్తే.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే పదో వర్ధంతి సందర్భంగా.. శివసేన రెబల్ నేత, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. బుధవారం రోజు బాలాసాహెబ్ థాక్రే సమాధిని సందర్శించారు.. నివాళులర్పించి అంజలి ఘటించారు.. అయితే, ఆ తర్వాత అక్కడకు చేరుకున్న శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గం నేతలు, కార్యకర్తలు.. బాల్ థాక్రే సమాధిని శుద్ధి చేశారు. బాల్ ఠాక్రే మెమోరియల్ ప్రాంగణం మొత్తం.. ఆయన సమాధిని నీటితో కటిగేశారు.. గోమూత్రం చల్లి శుద్ధి చేశారు… ఇక, ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. రెచ్చిపోయే నెటిజన్లకు.. దీనికి సంబంధించిన వీడియో దొరికింది.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండే వర్గం మండిపడుతోంది.. బాలాసాహెబ్ థాక్రే ఎవరో ఒక వ్యక్తికి..? లేదా ఒక పార్టీకి చెందినవ్యక్తి కాదని శివసేన రెబల్ వర్గం నేత దీపక్ కేసర్కర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!