Thackeray Memorial purified: బాల్ థాక్రే సమాధి వద్ద నివాళులర్పించిన ఏక్నాథ్ షిండే.. గోమూత్రంతో శుద్ధి చేసిన శివసేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thackeray Memorial purified: మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేకి నమ్మకస్తుండి.. తన కేబినెట్లో మంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే.. బయటకు వెళ్లిపోవడమే కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలను సైతం తన వెంట తీసుకెళ్లాడు.. దీంతో ఉద్ధవ్ సర్కార్ కూలిపోయింది.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.. దీంతో, షిండేను వెనక ఉండి నడిపించింది మొత్తం భారతీయ జనతా పార్టీయేనని స్పష్టమైపోయింది.. ఇక, అప్పటి నుంచి శివసేనలో వర్గపోరు నడుస్తూనే ఉంది.. పార్టీ పేరు, సింబల్ విషయంలోనూ న్యాయపోరాటం చేస్తున్నాయి రెండు వర్గాలు.. ఇప్పుడు శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Read Also: Botsa Satyanarayana: తథాస్తు.. చంద్రబాబు కోరిక తప్పకుండా నెరవేరుతుంది
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ఇక, అసలు విషయానికి వస్తే.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే పదో వర్ధంతి సందర్భంగా.. శివసేన రెబల్ నేత, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. బుధవారం రోజు బాలాసాహెబ్ థాక్రే సమాధిని సందర్శించారు.. నివాళులర్పించి అంజలి ఘటించారు.. అయితే, ఆ తర్వాత అక్కడకు చేరుకున్న శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గం నేతలు, కార్యకర్తలు.. బాల్ థాక్రే సమాధిని శుద్ధి చేశారు. బాల్ ఠాక్రే మెమోరియల్ ప్రాంగణం మొత్తం.. ఆయన సమాధిని నీటితో కటిగేశారు.. గోమూత్రం చల్లి శుద్ధి చేశారు… ఇక, ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. రెచ్చిపోయే నెటిజన్లకు.. దీనికి సంబంధించిన వీడియో దొరికింది.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండే వర్గం మండిపడుతోంది.. బాలాసాహెబ్ థాక్రే ఎవరో ఒక వ్యక్తికి..? లేదా ఒక పార్టీకి చెందినవ్యక్తి కాదని శివసేన రెబల్ వర్గం నేత దీపక్ కేసర్కర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!