Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Digital Plan: దేశంలోని ఉగ్రవాదులు తమ నెట్వర్క్ను విస్తరించేందుకు, సరిహద్దుల అవతల ఉన్న తమ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించేందుకు అత్యంత అధునాతన మార్గాలను ఎంచుకుంటున్నారు. భద్రతా దళాల నిఘా నుంచి తప్పించుకోవడానికి వారు సరికొత్త ‘డిజిటల్ కోడ్వర్డ్’లను ఉపయోగిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో తేలింది. ముఖ్యంగా విదేశీ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్లే ఇప్పుడు ఉగ్రవాదులకు ప్రధాన ఆయుధాలుగా మారాయి.
ఎన్క్రిప్టెడ్ యాప్స్ నుంచే అంతా..
లష్కరే తోయిబా (LeT), జైషే మహమ్మద్ వంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన లష్కర్ ఉగ్రవాది ‘హురైరా’ను విచారించిన ఎన్ఐఏ అధికారులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. నిఘా అధికారులకు చిక్కిన ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న కొన్ని యాప్స్ కనీసం మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ లేకుండానే పనిచేస్తాయి. దీనివల్ల వారిని ట్రేస్ చేయడం లేదా వారి మాటలను డీకోడ్ చేయడం దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారింది. దర్యాప్తు సంస్థల రడార్లో ప్రధానంగా ‘త్రీమా’ అనే స్విస్ ఆధారిత మెసేజింగ్ యాప్ ఉంది. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగిన ప్లాట్ఫామ్. ఇందులో ఖాతా తెరవడానికి వ్యక్తిగత సమాచారం ఏదీ అవసరం లేదు.
Also Read
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
డస్ట్ మెసెంజర్ అనే అమెరికాకు చెందిన యాప్ను కూడా ఉగ్రవాదులు విరివిగా వాడుతున్నారు. దీని ద్వారా సరిహద్దుల అవతల ఉన్న నేతలతో నిరంతరం మాట్లాడుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఎలిమెంట్ అనే ప్లాట్ఫామ్ను సమాచార మార్పిడి కోసం లష్కర్ ఉగ్రవాదులు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ డిజిటల్ నెట్వర్క్ను ఛేదించేందుకు NIA, ఇతర భద్రతా సంస్థలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ యాప్స్ ద్వారా సరిహద్దుల అవతల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? ఏయే ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేశారు? అనే కోణంలో డిజిటల్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి టెర్రరిస్టులు ఇలాంటి టెక్నాలజీని వాడుతుండటం అంతర్గత భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..