Tejashwi Yadav: గోడి మీడియాను నమ్మొద్దు.. సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
- గోడి మీడియాను నమ్మొద్దు
- సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ‘గోడి మీడియా’ చేస్తున్న తప్పుడు సర్వేలు అని ధ్వజమెత్తారు. బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడితో ఈ సర్వేలు వచ్చాయన్నారు. ‘SIR’ సమయంలో గోడి మీడియా బీహార్లోకి ప్రవేశించి చేసిన సర్వేగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: కూటమిలో జోష్.. భారీగా లడ్డూలు సిద్ధం చేస్తున్న కార్యకర్తలు
Also Read
నవంబర్ 14న ఫలితాలు మహాఘట్బంధన్కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని.. నవంబర్ 18న ప్రమాణస్వీకారం ఉంటుందని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగిస్తే.. అంతక ముందే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయని.. ఓటింగ్ ముగియకుండానే సర్వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్పై కీలక విషయాలు.. దర్యాప్తులో కొత్త మిస్టరీ!
మాకు అందుతున్న సమాచారం మేరకు ఫలితాలు మహాఘట్బంధన్కు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. 1995 ఎన్నికల కంటే మెరుగ్గా ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహారీయులంతా అధికార కూటమిపై విసుగుపోయారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో మార్పు రాబోతోందని.. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి విడత నవంబర్ 6న జరగగా.. రెండో విడత నవంబర్ 11న జరిగింది. ఎన్నికల ఫలితాలు శుక్రవారం (14-11-2025) విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండగా.. ఎన్డీఏ కూటమి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే రంగంలోకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏకు అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నేతలు జోష్లో ఉన్నారు.
#WATCH | Patna: On #BiharElection2025 Exit Polls, RJD leader and Mahagathbandhan CM face Tejashwi Yadav says, "We neither rejoice nor harbour any misconception over surveys. These surveys are just psychological pressure, brought under pressure by officers…The surveys have been… pic.twitter.com/qe9mGjfF0T
— ANI (@ANI) November 12, 2025
#WATCH | #BiharElection2025 | Patna: RJD leader and Mahagathbandhan CM face Tejashwi Yadav says, "We had said earlier that results will come on 14th Nov and there will be oath ceremony on 18th Nov. This is definitely going to happen. The feedback that we have been receiving has… pic.twitter.com/BihqThbbwf
— ANI (@ANI) November 12, 2025
#WATCH | #BiharElection2025 | Patna: RJD leader and Mahagathbandhan CM face Tejashwi Yadav says, "…The feedback that we have been getting is very positive. This is better than the 1995 elections' feedback. There was a high voter turnout and people voted against this Govt. There… pic.twitter.com/nQ7Vw93C8i
— ANI (@ANI) November 12, 2025
తాజావార్తలు
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!