Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా?
- ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తాం
- కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శలు గుప్పించారు. రూ.600 కోట్ల నిధులతో మైనార్టీ కాలనీలు అభివృద్ధి చేయడమేంటి? అని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ‘‘పేదరికం, వెనుకబడిన స్థితి వంటి సామాజిక-ఆర్థిక ప్రమాణాల ఆధారంగా కాకుండా.. కేవలం మతం ఆధారంగా మైనారిటీ కాలనీలకు ప్రజా నిధులు కేటాయించడం ఏ రాజ్యాంగ నిబంధన కింద జరుగుతోంది?.’’ అని ప్రశ్నించారు.
ఈ పథకం రాజ్యాంగంలోని భారత రాజ్యాంగంలోని 14వ అధికరణం, భారత రాజ్యాంగంలోని 15వ అధికరణలకు విరుద్ధమవుతుందని పేర్కొన్నారు. ‘‘వ్యక్తులకు మతం ఉండొచ్చు. కానీ రోడ్లు, డ్రైనేజీలు, వీధులు, కాలనీలకు ఎప్పటి నుంచి మతం వచ్చింది? భౌగోళిక ప్రాంతాలకు మత గుర్తింపును ఇచ్చి.. ఆ ఆధారంగా ప్రజా డబ్బు ఖర్చు చేయడం రాజ్యాంగబద్ధమా? ఇది మత ప్రాతిపదికన గేట్టోరైజేషన్ను ప్రోత్సహించడం కాదా?” అంటూ నిలదీశారు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
‘‘నిజంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమైతే.. అదే విధంగా పేద హిందూ, దళిత, ఎస్సీ/ఎస్టీ, ఒబీసీ కాలనీలను ఎందుకు చేర్చడం లేదు?’’ అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని వెల్లడించారు.
కర్ణాటక కేబినెట్ గురువారం రూ.600 కోట్ల యాక్షన్ ప్లాన్కు ఆమోదం తెలిపింది. 2026 నుంచి 2028 వరకు రాష్ట్రంలోని 11 నగర పాలక సంస్థల పరిధిలోని పలు కాలనీల అభివృద్ధిని ఈ పథకం కింద చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి.
ఇక ప్రభుత్వం.. ‘‘కర్ణాటక స్టేట్ ఎక్సైజ్ రీఫార్మ్స్ 2026’’ ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఈ విధానం మద్యం వినియోగానికి సంబంధించిన సామాజిక వ్యయాలను ప్రతిబింబించేలా ధరలను నిర్ణయించే లక్ష్యంతో రూపొందించబడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..మద్యం ద్వారా సంవత్సరానికి రూ.34,600 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ.. రోడ్డు ప్రమాదాలు, గృహ హింస, కాలేయ వ్యాధులు, మద్యం అలవాట్లు, కుటుంబ ఆదాయం నష్టం వంటి సామాజిక వ్యయాలు సుమారు రూ.51,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా.
కొత్త విధానంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్నులు, క్యూ ఆర్ కోడ్ ఆధారిత సరఫరా ట్రాకింగ్, డిజిటల్ లైసెన్సింగ్ సరళీకరణ, ఆరోగ్య హెచ్చరికల ప్రమాణీకరణ, కోటా విధానం బదులుగా రిజిస్ట్రేషన్ విధానం వంటి మార్పులను ప్రతిపాదించారు. అలాగే పాఠశాలలు, ఆసుపత్రుల సమీపంలో మద్యం విక్రయాలకు పరిమితులు విధించే అంశం కూడా ఇందులో ఉంది.
తాజావార్తలు
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!