Tejashwi Yadav: ఆయనే బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav comments, Nitish Kumar might be ‘strong candidate’ for PM: ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి.. ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మోదీకి ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకుంటే.. నితీష్ కుమార్ బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి కాగలరని అన్నారు.
బీహర్ లో ఆర్జేడీ-జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ రాజ్ వస్తుందని బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. బీజేపీ విమర్శలను ‘ అలసిపోయిన ఉపన్యాసం’, ‘ఏడ్చే తోడేళ్లు’ అని విమర్శించారు. బీహార్ లోని మహాఘటబంధన్ ప్రభుత్వం విపక్షాల ఐక్యతకు మంచి సూచన అని ఆయన అన్నారు. బీజేపీ ఆధిపత్యాన్ని చాలా ప్రతిపక్ష పార్టీలు గుర్తించాయని.. డబ్బు, మీడియా, పాలనా యంత్రాంగాన్ని ఉపయోగించుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన విమర్శించారు. కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి బీజేపీవన్నీ మాటలే అని.. ప్రాంతీయ అసమానతలను బీజేపీ విస్మరిస్తోందని తేజస్వీయాదవ్ అన్నారు. నితీష్ కుమార్ 37 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రజల అభిమానాలు కలిగి ఉన్నారని అన్నారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: Hrithik Roshan Zomato Ad Controversy: హృతిక్ రోషన్ ప్రకటనపై జొమాటో క్షమాపణ
ఇటీవల ఎన్డీయే నుంచి నితీష్ కుమార్ జేడీయూ పార్టీ బయటకు వచ్చింది. బీజేపీతో అధికారాన్ని పంచుకున్న జేడీయూ ఆ బంధానికి స్వస్తి పలికింది. ఆర్జేడీ పార్టీతో జతకలిసి మళ్లీ అధికారాన్ని చేపట్టింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత, లాలూ కుమార్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్షంలోకి మారింది. ఇటీవల ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ పార్టీ కూటమిలో 31 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజావార్తలు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..