Tejashwi Yadav: ఆయనే బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav comments, Nitish Kumar might be ‘strong candidate’ for PM: ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి.. ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మోదీకి ధీటైన ప్రధాన మంత్రి అభ్యర్థి అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకుంటే.. నితీష్ కుమార్ బలమైన ప్రధాన మంత్రి అభ్యర్థి కాగలరని అన్నారు.
బీహర్ లో ఆర్జేడీ-జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ రాజ్ వస్తుందని బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. బీజేపీ విమర్శలను ‘ అలసిపోయిన ఉపన్యాసం’, ‘ఏడ్చే తోడేళ్లు’ అని విమర్శించారు. బీహార్ లోని మహాఘటబంధన్ ప్రభుత్వం విపక్షాల ఐక్యతకు మంచి సూచన అని ఆయన అన్నారు. బీజేపీ ఆధిపత్యాన్ని చాలా ప్రతిపక్ష పార్టీలు గుర్తించాయని.. డబ్బు, మీడియా, పాలనా యంత్రాంగాన్ని ఉపయోగించుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన విమర్శించారు. కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి బీజేపీవన్నీ మాటలే అని.. ప్రాంతీయ అసమానతలను బీజేపీ విస్మరిస్తోందని తేజస్వీయాదవ్ అన్నారు. నితీష్ కుమార్ 37 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని కలిగి ఉండటంతో పాటు ప్రజల అభిమానాలు కలిగి ఉన్నారని అన్నారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: Hrithik Roshan Zomato Ad Controversy: హృతిక్ రోషన్ ప్రకటనపై జొమాటో క్షమాపణ
ఇటీవల ఎన్డీయే నుంచి నితీష్ కుమార్ జేడీయూ పార్టీ బయటకు వచ్చింది. బీజేపీతో అధికారాన్ని పంచుకున్న జేడీయూ ఆ బంధానికి స్వస్తి పలికింది. ఆర్జేడీ పార్టీతో జతకలిసి మళ్లీ అధికారాన్ని చేపట్టింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత, లాలూ కుమార్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం ప్రతిపక్షంలోకి మారింది. ఇటీవల ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ పార్టీ కూటమిలో 31 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!