Tejashwi Yadav: మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్లా మారింది..
- బీజేపీ బీహార్ను తాలిబాన్గా మార్చింది..
- మోడీ, నితీష్ కుమార్లపై తేజస్వీ యాదవ్ విమర్శలు..
- ఇటీవల బీహార్ వ్యాప్తంగా పెరిగిన హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పరాస్ ఆస్పత్రి కాల్పులు, వ్యాపారవేత్త హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న హత్యలపై బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిస్సహాయంగా ఉందని అన్నారు. ‘‘బీహార్ని బీజేపీ తాలిబాన్గా మార్చింది’’ అని ఆరోపించారు.
Read Also: Liquor Scam Case: క్లైమాక్స్కి చేరిన లిక్కర్ స్కాం కేసు.. విచారణలో కీలక విషయాలు..
Also Read
‘‘బీజేపీ బీహార్ ను తాలిబాన్ గా మార్చింది! గయలో డాక్టర్ కాల్పులు. పాట్నాలో రెండు గ్రూపుల మధ్య బహిరంగ కాల్పులు. పాట్నాలో మహిళ కాల్పులు. రోహ్తాస్లో వ్యాపారవేత్త హత్య.’’ అంటూ ఎక్స్లో తేజస్వీ యాదవ్ ఒక పోస్ట్ పెట్టారు. బీహార్లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కారణమని ఆరోపించారు.
బీహార్లో కొన్ని వారాలుగా జరుగుతున్న ముఠా హత్యలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఐదుగురు గుర్తుతెలియని దుండగులు పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోకి చొరబడి, పెరోల్పై వచ్చిన ఖైదీని కాల్చి చంపారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఒక రిటైర్డ్ ఉద్యోగిని కాల్చి వెళ్లిన ఘటనను ప్రస్తావించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని ప్రస్తావించారు. రోహ్తాస్ జిల్లాలో 24 గంటల్లో రెండు హత్యలు జరిగినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!