Teacher: “నా గర్ల్ఫ్రెండ్గా ఉండు”.. ఏకలవ్యుడిని ఉదహరిస్తూ, విద్యార్థినికి టీచర్ వేధింపులు..
- 12వ తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడి వేధింపులు..
- గర్ల్ ఫ్రెండ్గా ఉండాలంటూ ఒత్తిడి..
- ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినిని తన ‘‘గర్ల్ఫ్రెండ్’’గా ఉండాలని కోరాడు. ఈ ఘటన బీహార్లో జరిగింది. తన గురుదక్షిణ కింద గర్ల్ ఫ్రెండ్గా మారమని కోరడం పెద్ద వివాదానికి దారి తీసింది. బాలిక పాఠశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. పాఠశాల అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు సదరు ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కిసాన్గంజ్ జిల్లాలోని కిసాన్ హైస్కూల్ ఉపాధ్యాయుడు వికాస్ కుమార్ 12వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఫోన్ చేసి పలుసార్లు వేధించాడు. ఇద్దరం కలిసి సిలిగురి వెళ్తామని ప్రపోజ్ చేశాడు. అసభ్యకరంగా ప్రవర్తించారని అమ్మాయి ఆరోపించింది. మహాభారతంలో ఎకలవ్యుడని ఉదాహరణగా తీసుకుని ద్రోణాచార్యుడిగా గురువుగా భావించి, గురుదక్షిణగా కుడి చేతి బొటనవేటు కోసి ఇచ్చాడని, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి ఎందుకు కాలేకపోతున్నావు అని ఉపాధ్యాయుడు ప్రశ్నించాడని విద్యార్థిన ఆరోపించింది.
Also Read
- Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Read Also: NABARD State Focus Paper: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలి: మంత్రి తుమ్మల
దీనిపై బాలిక తన ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, పాఠశాలలో అతడిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. గతంలో స్కూల్ లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలికి ఇలాగే ప్రపోజ్ చేసినట్లు తెలిసింది, ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రిన్సిపాల్ షఫీక్ అహ్మద్ ఈ విషయంపై జిల్లా విద్యా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ విద్యాశాఖ నిందితుడైన ఉపాధ్యాయుడు వికార్ కుమార్ నుంచి వివరణ కోరడం తప్పా, మరే చర్య తీసుకోలేదు.
ఆ టీచర్ ఇంకా సమాధానం ఇవ్వలేదు, కిషన్ గంజ్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఇన్విజిలేటర్గా పనిచేస్తున్నాడు. తనపై వచ్చిన ఆరోపణపై ఉపాధ్యాయుడు స్పందించేందుకు నిరాకరించారు. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు పాఠశాల ముందు ధర్నా చేశారు. పోలీసులు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నామని, విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్లో జాబ్స్కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!