Presidential Election 2022: ఓటు వేయని బాలయ్య.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP MLA Balakrishna Did Not Cast His Vote In Presidential Election 2022: ఢిల్లీలోని పార్లమెంట్లో సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా మొదలైన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఇందుకు కారణం.. ఆయన విదేశాల్లో ఉండటమే! ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన, ఇంకా భారత్కి తిరిగి రాలేదు. అందుకే, ఓటింగ్కు హాజరు కాలేకపోయారు. మరో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమహేంద్రవరం రూరల్) కూడా అమెరికా పర్యటనలో ఉండటం వల్ల.. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్లో పాల్గొనలేదు. కాగా.. ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి 167 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు.
ఇదిలావుండగా.. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. చకచకా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, ఓ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ, ఇంతవరకూ టైటిల్ ప్రకటించలేదు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఓటమి ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108వ సినిమా చేయనున్నారు. తండ్రి, కూతురు బంధం నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించనుంది. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో సెట్స్ మీదకి వెళ్లనుంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!