Tara Shahdeo: షూటర్ తారా “లవ్ జిహాద్” కేసు.. మాజీ భర్తకు జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ ‘లవ్ జిహాద్’ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బలవంతపు మతమార్పిడి, ముస్లిం వ్యక్తి అయి ఉండీ హిందువుగా నటించి తారా సహదేవ్ ని పెళ్లాలడం, ఆ తరువాత బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో కీలక తీర్పును వెల్లడించింది. తారా సహదేవ్ మాజీ భర్త రకీబుల్కు జీవిత ఖైదు విధించిడంతో పాటు అతడి తల్లి కౌసర్ రాణికి పదేళ్లు జైలు శిక్ష, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు. దీంతో పాటు నిందితులకు రూ. 50,000 జరిమానా విధించింది.
ఈ కేసులో తీర్పుపై తారా ఆనందం వ్యక్తం చేశారు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ న్యాయం తనకు మాత్రమే కాదని తనలా బాధించబడుతున్న మహిళలకు ముందడుగు అని ఆమె అన్నారు. ప్రతీ మహిళలో విశ్వాసాన్ని నింపుతుందని, నాలాంటి అమ్మాయిలు అన్యాయాలపై ఎదురించి పోరాడేందుకు సహాయపడుతుందని ఆమె అన్నారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
Read Also:Ukraine War: ఉక్రెయిన్ సూపర్ మార్కెట్పై రష్యా దాడి.. 49 మంది మృతి
కేసు వివరాలు ఇవే:
జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ని రకీబుల్ అనే వ్యక్తి రంజిత్ కోహ్లీగా పేరు మార్చుకుని ప్రేమ పేరుతో వంచించి 2014లో వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ.. కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తారా సహదేవ్ కి తెలిసింది. అప్పటి నుంచి ఆమె భర్త రకీబుల్ హసన్ తో పాటు ఆమె తల్లి కౌసర్ రాని మతం మార్చుకోవాని ఆమెపై ఒత్తడి తెచ్చారు. హింసకు గురిచేశారు.
నేరపూరిత కుట్రతో పాటు, పదే పదే అత్యాచారం చేసేందుకు కుట్ర, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై హింద్పిరి పోలీస్ స్టేషన్ లో తార ఫిర్యాదు చేశారు. ముందస్తు కుట్ర ప్రకారమే ముగ్గురు నిందితులు తారా సహదేవ్ ని మోసం చేశారు.
నిందితులు తారని మానసికంగా, శారీరకంగా ఇస్లాంలోకి మారాలని వేధించారు. ఈ కేసులో విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు 2015లో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ కేసు ‘లవ్ జిహాద్’ కేసుగా ఆరోపించబడింది. దాదాపుగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి పీకే శర్మ గత వారం ముగ్గురిని దోషులుగా తేల్చారు. తాజాగా ఈ రోజు శిక్షను విధించారు. 2018లో రాంచీ ఫ్యామిలీ కోర్టు తారకు విడాకులు మంజూరు చేసింది.
#WATCH | Ranchi, Jharkhand: National Shooter Tara Shahdeo says, "I want to thank the court and the CBI who served me justice. This justice is not just for me, every daughter in the country will gain trust that whoever does this to them will be punished. People who do this would… pic.twitter.com/zBpgxOWocZ
— ANI (@ANI) October 5, 2023
తాజావార్తలు
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!