Tara Shahdeo: షూటర్ తారా “లవ్ జిహాద్” కేసు.. మాజీ భర్తకు జీవిత ఖైదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ ‘లవ్ జిహాద్’ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బలవంతపు మతమార్పిడి, ముస్లిం వ్యక్తి అయి ఉండీ హిందువుగా నటించి తారా సహదేవ్ ని పెళ్లాలడం, ఆ తరువాత బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో కీలక తీర్పును వెల్లడించింది. తారా సహదేవ్ మాజీ భర్త రకీబుల్కు జీవిత ఖైదు విధించిడంతో పాటు అతడి తల్లి కౌసర్ రాణికి పదేళ్లు జైలు శిక్ష, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు. దీంతో పాటు నిందితులకు రూ. 50,000 జరిమానా విధించింది.
ఈ కేసులో తీర్పుపై తారా ఆనందం వ్యక్తం చేశారు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ న్యాయం తనకు మాత్రమే కాదని తనలా బాధించబడుతున్న మహిళలకు ముందడుగు అని ఆమె అన్నారు. ప్రతీ మహిళలో విశ్వాసాన్ని నింపుతుందని, నాలాంటి అమ్మాయిలు అన్యాయాలపై ఎదురించి పోరాడేందుకు సహాయపడుతుందని ఆమె అన్నారు.
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
Read Also:Ukraine War: ఉక్రెయిన్ సూపర్ మార్కెట్పై రష్యా దాడి.. 49 మంది మృతి
కేసు వివరాలు ఇవే:
జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ని రకీబుల్ అనే వ్యక్తి రంజిత్ కోహ్లీగా పేరు మార్చుకుని ప్రేమ పేరుతో వంచించి 2014లో వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ.. కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తారా సహదేవ్ కి తెలిసింది. అప్పటి నుంచి ఆమె భర్త రకీబుల్ హసన్ తో పాటు ఆమె తల్లి కౌసర్ రాని మతం మార్చుకోవాని ఆమెపై ఒత్తడి తెచ్చారు. హింసకు గురిచేశారు.
నేరపూరిత కుట్రతో పాటు, పదే పదే అత్యాచారం చేసేందుకు కుట్ర, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై హింద్పిరి పోలీస్ స్టేషన్ లో తార ఫిర్యాదు చేశారు. ముందస్తు కుట్ర ప్రకారమే ముగ్గురు నిందితులు తారా సహదేవ్ ని మోసం చేశారు.
నిందితులు తారని మానసికంగా, శారీరకంగా ఇస్లాంలోకి మారాలని వేధించారు. ఈ కేసులో విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు 2015లో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ కేసు ‘లవ్ జిహాద్’ కేసుగా ఆరోపించబడింది. దాదాపుగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి పీకే శర్మ గత వారం ముగ్గురిని దోషులుగా తేల్చారు. తాజాగా ఈ రోజు శిక్షను విధించారు. 2018లో రాంచీ ఫ్యామిలీ కోర్టు తారకు విడాకులు మంజూరు చేసింది.
#WATCH | Ranchi, Jharkhand: National Shooter Tara Shahdeo says, "I want to thank the court and the CBI who served me justice. This justice is not just for me, every daughter in the country will gain trust that whoever does this to them will be punished. People who do this would… pic.twitter.com/zBpgxOWocZ
— ANI (@ANI) October 5, 2023
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?