Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు అనుచిత ప్రవర్తన
- సాధారణంగా సంభాషించు కుంటూ నవ్వుకున్న పోలీసులు
- పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఇటీవల 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి విజయ్ పోలీసులకు ఆదేశించారు. అయితే తాజాగా పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు నెట్టింట తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియా వేదికగా పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు.
మే 21న కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించింది. అయితే సోమవారం ఈ ఘటనపై పోలీసులు ప్రెస్మీట్ నిర్వహించారు. వెస్ట్ జోన్ ఐజీ ఆర్.వి. రమ్య భారతి, కోయంబత్తూరు రేంజ్ డీఐజీ పి. సమినాథన్, కోయంబత్తూరు ఎస్పీ అల్లటిపల్లి పవన్ కుమార్ రెడ్డి కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. అయితే ఒక సీరియస్ మేటర్పై ప్రెస్మీట్ నిర్వహిస్తున్నామన్న ఇంకిత జ్ఞానం లేకుండా.. ముగ్గురూ కూడా సాధారణ సంభాషణలో మునిగిపోయారు. రమ్య భారతి గోళ్లు గిల్లుకుంటూ.. జోకులు వేసుకుంటూ.. నవ్వుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగానే.. వేగంగా వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..
- Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
- Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
“ఇంత తీవ్రమైన కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా నవ్వడం ఏంటి? ఇది అసమర్థత” అని ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు “10 ఏళ్ల చిన్నారి హత్యపై ఇంత నిర్లక్ష్యమా? ఇది అతి అవమానకరం” అని పేర్కొన్నారు. మరికొందరు “ఇలాంటి అధికారులు ఈ పదవులకు అర్హులు కారు” అని విమర్శించగా.. “సివిల్ సొసైటీగా మనం విఫలమయ్యాం” అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో తమిళనాడు పరిశ్రమల మంత్రి ఎస్. కీర్తన కూడా ఈ కేసు నేపథ్యంలో విమర్శలకు గురయ్యారు. మీడియా ప్రశ్నలకు స్పందించిన సమయంలో ఆమె కూడా నవ్వినట్లు కనిపించడంతో బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయితే మీడియా సమావేశం ముగిసిన తర్వాతే ఆ నవ్వు వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
-
Iran-Hormuz: హార్ముజ్పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?
-
Monsoon Tips: వర్షాకాలంలో ఊరగాయలపై బూజు పట్టకుండా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి..!
-
YS Jagan: ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం.. మరో ఏడాదిలో పాదయాత్ర..
-
Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!