Tamil nadu: నిట్ కాలేజీలో దారుణం.. ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. అరెస్ట్
- తమిళనాడు నిట్ కాలేజీలో దారుణం
- ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే దేశమంతా ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. న్యాయం కోసం వైద్యులు, నర్సులు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. రెండు వారాల నుంచి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. ఇంత జరుగుతున్నా మృగాళ్లలో మార్పు కనిపించడం లేదు. తాజాగా తమిళనాడు నిట్ మహిళా హాస్టల్లో విద్యార్థినిపై వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కాలేజీలో వైఫై సమస్యలను పరిష్కరించడానికి నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లోని హాస్టల్ గదిలో గురువారం రాత్రి తనను లైంగికంగా వేధించాడని విద్యార్థిని ఆరోపించింది. గత రాత్రి విద్యార్థిని గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ సంఘటన నిరసనలకు దారితీసింది. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన తర్వాత హాస్టల్ వార్డెన్ను మరో చోటికి బదిలీ చేశారు.
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. కాలేజీలో భద్రతా లోపం ఏర్పడిందని చెప్పారు. మహిళా హాస్టల్లోకి పురుష వర్కర్ను అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇన్స్టిట్యూట్ అంతర్గత చర్యలు తీసుకుంటోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు, బాలికలపై పెరుగుతున్న నేరాలపై అధికార డీఎంకే ఉక్కుపాదం మోపడం లేదని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!