Tamil Nadu: అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఫ్రిజ్లు, ల్యాప్టాప్లు, పంపు సెట్లు.. తమిళనాడు ప్రజలపై వరాల జల్లు..
- తమిళనాడు ఓటర్లపై ఉచితాల వర్షం..
- ఫ్రీ ఫ్రిజ్, ఫ్రీ ల్యాప్టాప్, ఫ్రీ పంపు సెట్లు..
- డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలు ఉచితాల బాటలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు ఎన్నికలు అంటేనే ‘‘ఉచితాలు’’. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు కూడ ఉచితాలనే ఉపయోగిస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫ్రీ హామీలు వర్షంలా కురస్తున్నాయి. అధికార డీఎంకేతో పాటు ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటర్లపై హామీల వర్షాన్ని కురిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఫ్రిజ్ ఇస్తామని అన్నాడీఎంకే చెబితే, డీఎంకే విద్యార్థినులకు ఉచిత ల్యాప్టాప్లు అంటూ ఊదరగొడుతోంది. డీఎంకేతో పోలిస్తే అన్నాడీఎంకే ఉచితాల్లో ముందుంది.
* తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా రిఫ్రిజ్రేటర్ అందిస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు.
* డీఎంకే ప్రతీ నెల కుటుంబానికి రూ. 1000 ఇస్తుంటే, అన్నాడీఎంకే రూ. 2000 ఇస్తామని చెబుతోంది.
* డీఎంకే కేవలం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంటే, అన్నాడీఎంకే పురుషులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామని చెప్పింది.
* ఇక విజయ్ టీవీకే పార్టీ రేషన్ కార్డు ఉన్నవారికి రూ. 2500 ఇస్తామని హమీ ఇచ్చింది.
* ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉన్నత చదువులు చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచితంగా పంప్ సెట్లు, మహిళా సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఉచితాల చరిత్ర ఇప్పటిది కాదు..
తమిళనాడులో ఉచితాల చరిత్ర కొన్ని దశాబ్ధాలతో ముడిపడి ఉంది. 1967లో సీఎన్ అన్నాదురై రూపాయికి బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత డీఎంకే నేత కరుణానిధి రేషన్ కార్డ్ ఉన్నవారికి 5 కేజీల బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు. 2006లో కరుణానిధి కలర్ టీవీ ఇస్తానని ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. కరుణానిథి ప్రత్యర్థి జయలలిత ఓటర్లకు ల్యాప్లాప్, మిక్సర్ గ్రైండర్లు, ఫ్యాన్లు ఇలా ఉచితాల వెల్లువ కురిపించారు. 2016లో జయలలిత ఉచిత మొబైల్ ఫోన్లు, 100 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు రాయితీపై స్కూటర్లు, పెళ్లిళ్లలో బంగారం వంటి హామీలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!