Kerala: కేరళలో వాహనదారులకు కొత్త రూల్స్.. ఇకపై ఇలా చేస్తే ఫైన్..!
- కేరళలో వాహనదారులకు కొత్త రూల్స్
- పిలియన్ రైడర్లతో సంభాషించడంపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదాలను అరికట్టేందుకు కేరళ రాష్ట్రం సరికొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై బైక్ ప్రయాణంలో వెనుక సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. పరధ్యానాన్ని తగ్గించడానికి, ప్రమాదాలను నివారించడానికి ద్విచక్ర వాహనదారులు పిలియన్ రైడర్లతో సంభాషించడాన్ని కేరళ నిషేధించింది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: “రాజ్యాంగానికి అతీతుడివి కాదు”.. రాహుల్ తీరుపై కేంద్రమంత్రుల ఆగ్రహం..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగే కాదు.. ఒక్కోసారి ద్విచక్రవాహనంలో ప్రయాణించేటప్పుడు వెనుక కూర్చొన్న వ్యక్తితో చోదకుడు మాట్లాడటం కూడా ప్రమాదాలకు దారి తీస్తుందని భావించిన ప్రభుత్వం.. ఓ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై డ్రైవింగ్ సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధన అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు వర్తిస్తుంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. పదే పదే ఈ నేరం పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Off The Record: అసెంబ్లీ సాక్షిగా చేసిన ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజమెంత?
కొత్త రూల్స్ను కచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వెనుక వ్యక్తితో మాట్లాడుతున్న రైడర్కు చలానాలు పంపనుంది. అయితే.. ఎంత మొత్తంలో జరిమానా విధిస్తారో మాత్రం తెలియలేదు. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధన బాగుందని కొందరు అభినందిస్తుంటే.. ఆంక్షలు మరీ కఠినంగా ఉన్నాయంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..
తాజావార్తలు
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!