PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ 2026
- ప్రధాని మోడీ పుట్టినరోజున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Swachhata Hi Seva Campaign 2026: దేశవ్యాప్తంగా స్వచ్ఛతను ప్రోత్సహించే ‘స్వచ్ఛతా హీ సేవ’ (Swachhata Hi Seva) కార్యక్రమం కొత్త దశ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దేశంలోని నగరాలు, వార్డులు, గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి యువతను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విద్యా సంస్థల్లో ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛతకు ప్రాధాన్యం
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రధాన ప్రదేశాలు, ప్రజా స్థలాలను శుభ్రం చేయడం, పారిశుద్ధ్య కార్మికుల కోసం భద్రతా శిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘జనభాగీదారీతో స్వచ్ఛత’, ‘స్వచ్ఛతతోనే సమృద్ధి’ అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా స్వచ్ఛతపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం 2017 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
సెప్టెంబర్ 27న పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ప్రత్యేక శుభ్రత
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఈ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దేశంలోని పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలు, స్థానిక సంస్థలు కలిసి పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.
అక్టోబర్ 1న ‘ఒక రోజు-ఒక గంట’ స్వచ్ఛతా కార్యక్రమం
అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా ‘ఒక రోజు-ఒక గంట’ అనే ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి ఏదైనా ఒక ప్రజా స్థలాన్ని శుభ్రం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఒకే సమయంలో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచనున్నారు.
అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్
అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. అదే సమయంలో ‘ఒక చెట్టు అమ్మ పేరుతో’ (Ek Ped Maa Ke Naam) కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
స్వచ్ఛతా కార్యక్రమాలపై ఆన్లైన్ పర్యవేక్షణ
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏ ప్రాంతంలో ఎంత శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు? ఎంత చెత్త సేకరించారు? అనే అంశాలను కూడా అంచనా వేయనున్నారు. ఈ వివరాలను నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు తమ పరిధిలో చేపట్టిన స్వచ్ఛతా చర్యల వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీరు వంటి సదుపాయాలకు సంబంధించిన వివరాలను కూడా అందులో నమోదు చేయనున్నారు.
ప్రజల భాగస్వామ్యమే కీలకం
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రజా స్థలాలను పరిశుభ్రంగా ఉంచడం, పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలు భాగస్వాములు కానున్నారు.
తాజావార్తలు
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!