West Bengal: బెంగాల్‌లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం

  • బెంగాల్‌లో మత పథకాలు, మదర్సా శాఖ రద్దు..
  • సువేందు అధికారి సంచలన నిర్ణయం..
West Bengal

West Bengal

West Bengal: బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తన దూకుడును చూపిస్తోంది. సీఎం సువేందు అధికారి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రెండో కేబినెట్ సమావేశం అనంతరం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. మహిళలకు రూ. 3000 సహాయాన్ని ఆమోదించారు. ఇదిలా ఉంటే మదర్సా శాఖ, సమాచార మరియు సాంస్కృతిక శాఖల పరిధిలోని మత ఆధారిత సహాయ పథకాలను దశల వారీగా నిలిపివేయాలని బెంగాల్ కేబినెట్ నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు.

Read Also: Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!

బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా, జూన్ 1 నుండి మహిళలకు 3,000 సహాయాలు అందించే “అన్నపూర్ణ యోజన”ను కూడా ఇది ఆమోదించింది. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నారు. సోమవారం నాడు సీఎం సువేందు అధికారి తన మొదటి ‘‘జనతా దర్బార్’’ను నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను విన్నారు. 15 ఏళ్లుగా మమతా బెనర్జీ సాధించలేని విజయాలను తమ డబుల్ ఇంజన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే సాధిస్తుందని బీజేపీ చెబుతోంది.