Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- సువెందు అధికారి పీఏ దారుణ హత్య
- కాల్చి చంపిన దుండగులు
- రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్లో రాజకీయ హింస మరోసారి పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి, నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో, సీనియర్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అయిన చంద్రనాథ్ రథ్ను దుండగులు దారుణంగా కాల్చి చంపారు. రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం, దోహరియా ప్రాంతంలో లైసెన్స్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు చంద్రనాథ్ కారును వెంబడించారు.
దుండగులు, వాహనాన్ని చుట్టుముట్టి అతి సమీపం నుంచి పలు దఫాలుగా కాల్పులు జరిపారు. రథ్కు ఐదు బుల్లెట్ గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు రథ్ మరణించినట్లు ప్రకటించారు. తూర్పు మేదినీపూర్కు చెందిన చంద్రనాథ్ రథ్, బీజేపీ వ్యూహాత్మక వర్గాలలో సుపరిచితమైన వ్యక్తి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు అధికారి బృందంలో ఆయన అత్యంత ప్రముఖులలో ఒకరు.
Also Read
ఈ హత్య బెంగాల్లో రాజకీయ దుమారాన్ని రేపింది. బీజేపీ దీనిని ‘రాజకీయ హత్య’గా అభివర్ణించి, శాంతిభద్రతలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. బెంగాల్లోని మధ్యమ్గ్రామ్లో తన పీఏ చంద్రనాథ్ రథ్ హత్యకు సంబంధించి, బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని, ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసి, రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారని అన్నారు.
ఆసుపత్రి బయట విలేకరులతో మాట్లాడుతూ సువెందు అధికారి ఇలా అన్నారు, ” ఇది పథకం ప్రకారం జరిగిన హత్య, డీజీపీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు, ఈ హత్య పక్కా ప్రణాళికతో జరిగింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేము తీవ్ర దుఃఖంలో ఉన్నాము, ఈ ఘటనను ఖండించడానికి మాటలు రావడం లేదని బరువెక్కిన హృదయంతో తెలిపారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!