Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- సువెందు అధికారి పీఏ దారుణ హత్య
- కాల్చి చంపిన దుండగులు
- రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్లో రాజకీయ హింస మరోసారి పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి, నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో, సీనియర్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అయిన చంద్రనాథ్ రథ్ను దుండగులు దారుణంగా కాల్చి చంపారు. రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం, దోహరియా ప్రాంతంలో లైసెన్స్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు చంద్రనాథ్ కారును వెంబడించారు.
దుండగులు, వాహనాన్ని చుట్టుముట్టి అతి సమీపం నుంచి పలు దఫాలుగా కాల్పులు జరిపారు. రథ్కు ఐదు బుల్లెట్ గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు రథ్ మరణించినట్లు ప్రకటించారు. తూర్పు మేదినీపూర్కు చెందిన చంద్రనాథ్ రథ్, బీజేపీ వ్యూహాత్మక వర్గాలలో సుపరిచితమైన వ్యక్తి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు అధికారి బృందంలో ఆయన అత్యంత ప్రముఖులలో ఒకరు.
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
ఈ హత్య బెంగాల్లో రాజకీయ దుమారాన్ని రేపింది. బీజేపీ దీనిని ‘రాజకీయ హత్య’గా అభివర్ణించి, శాంతిభద్రతలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. బెంగాల్లోని మధ్యమ్గ్రామ్లో తన పీఏ చంద్రనాథ్ రథ్ హత్యకు సంబంధించి, బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని, ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసి, రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారని అన్నారు.
ఆసుపత్రి బయట విలేకరులతో మాట్లాడుతూ సువెందు అధికారి ఇలా అన్నారు, ” ఇది పథకం ప్రకారం జరిగిన హత్య, డీజీపీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు, ఈ హత్య పక్కా ప్రణాళికతో జరిగింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేము తీవ్ర దుఃఖంలో ఉన్నాము, ఈ ఘటనను ఖండించడానికి మాటలు రావడం లేదని బరువెక్కిన హృదయంతో తెలిపారు.
తాజావార్తలు
-
Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్లోకి రీఎంట్రీ!
-
Explainer: గల్ఫ్లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
ట్రెండింగ్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!