Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- సువెందు అధికారి పీఏ దారుణ హత్య
- కాల్చి చంపిన దుండగులు
- రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్లో రాజకీయ హింస మరోసారి పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి, నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో, సీనియర్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అయిన చంద్రనాథ్ రథ్ను దుండగులు దారుణంగా కాల్చి చంపారు. రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం, దోహరియా ప్రాంతంలో లైసెన్స్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు చంద్రనాథ్ కారును వెంబడించారు.
దుండగులు, వాహనాన్ని చుట్టుముట్టి అతి సమీపం నుంచి పలు దఫాలుగా కాల్పులు జరిపారు. రథ్కు ఐదు బుల్లెట్ గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు రథ్ మరణించినట్లు ప్రకటించారు. తూర్పు మేదినీపూర్కు చెందిన చంద్రనాథ్ రథ్, బీజేపీ వ్యూహాత్మక వర్గాలలో సుపరిచితమైన వ్యక్తి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు అధికారి బృందంలో ఆయన అత్యంత ప్రముఖులలో ఒకరు.
Also Read
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
ఈ హత్య బెంగాల్లో రాజకీయ దుమారాన్ని రేపింది. బీజేపీ దీనిని ‘రాజకీయ హత్య’గా అభివర్ణించి, శాంతిభద్రతలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. బెంగాల్లోని మధ్యమ్గ్రామ్లో తన పీఏ చంద్రనాథ్ రథ్ హత్యకు సంబంధించి, బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని, ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసి, రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారని అన్నారు.
ఆసుపత్రి బయట విలేకరులతో మాట్లాడుతూ సువెందు అధికారి ఇలా అన్నారు, ” ఇది పథకం ప్రకారం జరిగిన హత్య, డీజీపీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు, ఈ హత్య పక్కా ప్రణాళికతో జరిగింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేము తీవ్ర దుఃఖంలో ఉన్నాము, ఈ ఘటనను ఖండించడానికి మాటలు రావడం లేదని బరువెక్కిన హృదయంతో తెలిపారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?