Maharashtra CM Post: సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా? ఎందుకో..!
- మహారాష్ట్ర సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా?
- డిసెంబర్ 4కు వాయిదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక డైలీ సీరియల్గా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపుగా 9 రోజులైంది. కానీ ఈరోజుకి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించలేదు. ఈరోజు.. రేపు అంటూ ఊరిస్తున్నారే తప్ప.. అధికారికంగా అభ్యర్థి పేరు మాత్రం ప్రకటించలేకపోతున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వ కాలం ఎప్పుడో ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా మహాయుతి కూటమికి భారీ విజయం కూడా ఉంది. కానీ సీఎం పేరు అధికారికంగా ప్రకటించడానికి జంకుతున్నారు. భవిష్యత్ ముప్పును దృష్టిలో పెట్టుకుని ఏం జరగుతుందోనన్న ఆందోళనతోనే పేరు ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ భయపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CRDA: సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. అమరావతి నిర్మాణంలో ముందడుగు..!
Also Read
సోమవారం సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే షిండేకు అనారోగ్యం కారణంగా ముంబైలో జరగాల్సిన ఎన్డీఏ సమావేశం రద్దైంది. దీంతో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన మళ్లీ వాయిదా పడింది. మరోవైపు మహారాష్ట్ర పంచాయితీ పరిష్కారం కోసం కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజారాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నియమింపబడ్డారు. ఇంకోవైపు డిసెంబర్ 5నే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం పేరు ప్రకటించలేదు. తాజాగా డిసెంబర్ 4న ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందు పేరు ప్రకటిస్తారని బీజేపీ నేత ఒకరు మీడియాకు వెళ్లడించారు. దీంతో మరికొన్ని గంటల పాటు సస్పెన్ష్ కొనసాగనుంది. డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు మహారాష్ట్ర విధాన్ భవన్లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది
ఇదిలా ఉంటే మళ్లీ తానే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని షిండే సన్నిహితుల దగ్గర అన్నారని సమాచారం. సామాన్యుడిగా ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృష్టి చేసినట్లు షిండే చెప్పుకొచ్చారు. అందుకోసం తిరిగి రావాలని ప్రజలు భావిస్తున్నారని షిండే చెప్పుకొచ్చినట్లు సమాచారం.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్లో నితీష్ కుమార్కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటన కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: Renuka Chowdhury: ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆగ్రహం
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..