Babri Masjid: బిర్యానీతో విందు, సౌదీ నుంచి మతాధికారులు.. బెంగాల్ ‘‘బాబ్రీ మసీదు’’ శంకుస్థాపన..
- ముర్షిదాబాద్లో మరో బాబ్రీ మసీదు..
- పశ్చిమ బెంగాల్లో ఈ రోజే శంకుస్థాపన..
- బిర్యానీలో విందు, సౌదీ మతాధికారుల ప్రార్థనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babri Masjid: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది. మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్లో శనివారం ఈ వ్యవహారం ఉద్రిక్తతల్ని పెంచింది. డిసెంబర్ 6, 1992న అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేశారు. ఇప్పుడు ఇదే తేదీ రోజు బాబ్రీ మసీదు శంకుస్థాపన జరిగింది.
Read Also: IndiGo CEO vs Central Govt: ఇండిగో సర్వీసుల్లో అంతరాయం.. సీఈవోపై వేటు పడేనా?
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాకు చెందిన మత ప్రముఖులు వచ్చారు. ఖురాన్ పారాయణం తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. ‘‘నారా-ఏ-తక్బీర్’’, ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు చేశారు. బెల్దంగాలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దతుదారులు ఇటుకలు మోసుకువచ్చారు. మతపరమైన అల్లర్లను నివారించేందుకు రాష్ట్ర, కేంద్ర బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. 67 శాతం ముస్లిం జనాభా ఉన్న ముర్షిదాబాద్లో ఈ ఏడాది ఏప్రిల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ శంకుస్థాపనను పెద్ద ఎత్తు నిర్వహించారు. సుమారుగా 40,000 మంది అతిథులు, 20,000 మంది స్థానిక నివాసితుల కోసం షాహి బిర్యానీని ఏర్పాటు చేశారు. కేవలం ఆహారం కోసమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు హుమాయున్ కబీర్ చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హిందువుల ఓట్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ను సస్పెండ్ చేసింది. మరోవైపు, బీజేపీ కూడా టీఎంసీపై విరుచుకుపడుతోంది. ఈ వివాదం ఇప్పుడు కలకత్తా హైకోర్టుకు కూడా చేరింది. సీఎం మమతా బెనర్జీ మాత్రమ మసీదు నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కాంగ్రెస్, బీజేపీతో సంబంధాలు ఉన్న కబీర్ ఈ కర్యక్రమం ద్వారా అంతరాయం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?