Babri Masjid: బిర్యానీతో విందు, సౌదీ నుంచి మతాధికారులు.. బెంగాల్ ‘‘బాబ్రీ మసీదు’’ శంకుస్థాపన..
- ముర్షిదాబాద్లో మరో బాబ్రీ మసీదు..
- పశ్చిమ బెంగాల్లో ఈ రోజే శంకుస్థాపన..
- బిర్యానీలో విందు, సౌదీ మతాధికారుల ప్రార్థనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babri Masjid: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది. మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్లో శనివారం ఈ వ్యవహారం ఉద్రిక్తతల్ని పెంచింది. డిసెంబర్ 6, 1992న అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేశారు. ఇప్పుడు ఇదే తేదీ రోజు బాబ్రీ మసీదు శంకుస్థాపన జరిగింది.
Read Also: IndiGo CEO vs Central Govt: ఇండిగో సర్వీసుల్లో అంతరాయం.. సీఈవోపై వేటు పడేనా?
Also Read
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాకు చెందిన మత ప్రముఖులు వచ్చారు. ఖురాన్ పారాయణం తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. ‘‘నారా-ఏ-తక్బీర్’’, ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు చేశారు. బెల్దంగాలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దతుదారులు ఇటుకలు మోసుకువచ్చారు. మతపరమైన అల్లర్లను నివారించేందుకు రాష్ట్ర, కేంద్ర బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. 67 శాతం ముస్లిం జనాభా ఉన్న ముర్షిదాబాద్లో ఈ ఏడాది ఏప్రిల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ శంకుస్థాపనను పెద్ద ఎత్తు నిర్వహించారు. సుమారుగా 40,000 మంది అతిథులు, 20,000 మంది స్థానిక నివాసితుల కోసం షాహి బిర్యానీని ఏర్పాటు చేశారు. కేవలం ఆహారం కోసమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు హుమాయున్ కబీర్ చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హిందువుల ఓట్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ను సస్పెండ్ చేసింది. మరోవైపు, బీజేపీ కూడా టీఎంసీపై విరుచుకుపడుతోంది. ఈ వివాదం ఇప్పుడు కలకత్తా హైకోర్టుకు కూడా చేరింది. సీఎం మమతా బెనర్జీ మాత్రమ మసీదు నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కాంగ్రెస్, బీజేపీతో సంబంధాలు ఉన్న కబీర్ ఈ కర్యక్రమం ద్వారా అంతరాయం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!