Babri Masjid: బిర్యానీతో విందు, సౌదీ నుంచి మతాధికారులు.. బెంగాల్ ‘‘బాబ్రీ మసీదు’’ శంకుస్థాపన..
- ముర్షిదాబాద్లో మరో బాబ్రీ మసీదు..
- పశ్చిమ బెంగాల్లో ఈ రోజే శంకుస్థాపన..
- బిర్యానీలో విందు, సౌదీ మతాధికారుల ప్రార్థనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babri Masjid: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది. మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్లో శనివారం ఈ వ్యవహారం ఉద్రిక్తతల్ని పెంచింది. డిసెంబర్ 6, 1992న అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేశారు. ఇప్పుడు ఇదే తేదీ రోజు బాబ్రీ మసీదు శంకుస్థాపన జరిగింది.
Read Also: IndiGo CEO vs Central Govt: ఇండిగో సర్వీసుల్లో అంతరాయం.. సీఈవోపై వేటు పడేనా?
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాకు చెందిన మత ప్రముఖులు వచ్చారు. ఖురాన్ పారాయణం తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. ‘‘నారా-ఏ-తక్బీర్’’, ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు చేశారు. బెల్దంగాలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దతుదారులు ఇటుకలు మోసుకువచ్చారు. మతపరమైన అల్లర్లను నివారించేందుకు రాష్ట్ర, కేంద్ర బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. 67 శాతం ముస్లిం జనాభా ఉన్న ముర్షిదాబాద్లో ఈ ఏడాది ఏప్రిల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ శంకుస్థాపనను పెద్ద ఎత్తు నిర్వహించారు. సుమారుగా 40,000 మంది అతిథులు, 20,000 మంది స్థానిక నివాసితుల కోసం షాహి బిర్యానీని ఏర్పాటు చేశారు. కేవలం ఆహారం కోసమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు హుమాయున్ కబీర్ చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హిందువుల ఓట్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ను సస్పెండ్ చేసింది. మరోవైపు, బీజేపీ కూడా టీఎంసీపై విరుచుకుపడుతోంది. ఈ వివాదం ఇప్పుడు కలకత్తా హైకోర్టుకు కూడా చేరింది. సీఎం మమతా బెనర్జీ మాత్రమ మసీదు నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కాంగ్రెస్, బీజేపీతో సంబంధాలు ఉన్న కబీర్ ఈ కర్యక్రమం ద్వారా అంతరాయం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!