Ayodhya Ram madir: ప్రధాని మోడీ స్పూర్తితోనే ‘‘సూర్య తిలకం’’ ఆచారం: అయోధ్య ట్రస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram madir: అయోధ్య రామమందిరంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ రోజు బాలరాముడి నుదుడిపై ‘‘సూర్య తిలకం’’ కార్యక్రమం జరిగింది. సూర్యడి కిరణాలు రాముడి నుదిటిపై ప్రకాశించాయి. అయితే, ఈ ‘‘సూర్య తిలకం’’ వేడుక ప్రధాని నరేంద్రమోడీ స్పూర్తితో జరిగిందని ఆలయ నిర్మాణ కమిటీ చీఫ్ చెప్పారు. రామ మందిర నిర్మాణ కమిటి అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకున్నప్పుడు ప్రధాని ఈ ఆలోచనను ప్రతిపాదించారని అన్నారు. రామ నవమి రోజున, ఆలయ గర్భగుడిలో ఉంచిర రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు తాకేలా చూసుకున్నామని, ప్రధాని కలను నిజం చేశామని ఆయన చెప్పారు. ప్రతీ రామ నవమి వేడుక రోజు ఈ ఆచారాన్ని నిర్వహిస్తామని చెప్పారు. దీని కోసం మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలతో కలిసి ప్రాజెక్టు రూపొందించామని అన్నారు.
Read Also: USA: ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’.. పీఎం మోడీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా..
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సూర్య తిలకం ఆచారాన్ని ప్రధాని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ క్షణం అద్భుతమైనదిగా, సాటిలేనిదిగా పీఎం మోడీ అభివర్ణించారు. అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అస్సాం నల్బరీ జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘‘ఈరోజు రామ నవమి చారిత్రాత్మక సందర్భం. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, రాముడు ఎట్టకేలకు తన గొప్ప ఆలయంలో ఆసీనుడయ్యాడు మరియు కేవలం కొద్ది నిమిషాలలో, తన ‘సూర్య తిలకం’ని వర్తింపజేయడం ద్వారా పుట్టినరోజు జరుపుకుంటారు’’ అని అన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజల్ని తమ మొబైల్ ఫోన్లలో టార్చ్ ఆన్ చేసి ఈ వేడుకను సంఘీభావం తెలపాలని కోరారు. ‘‘ మా మొబైల్ ఫోన్ల ద్వారా మేము శ్రీరాముడికి నమస్కరిస్తున్నాము. జైశ్రీరాం, జైజై శ్రీరాం, రామ్ లక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ’’ అంటూ నినాదలు చేయాలని ప్రధాని కోరారు.
తాజావార్తలు
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..