Modi Surname Remark: రాహుల్ గాంధీ పిటిషన్పై సూరత్ కోర్టు నేడు తీర్పు
Modi Surname Remark: పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన పిటిషన్పై సూరత్ కోర్టు నేడు తన తీర్పును ప్రకటించనుంది. ఈ కేసులో దోషిగా తేలడంతో అప్పీల్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతకు ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.మాజీ ఎంపీకి బెయిల్ మంజూరు చేస్తూనే, తన నేరారోపణపై స్టే విధించాలన్న కాంగ్రెస్ నాయకుడి విజ్ఞప్తిపై ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇది ఇరుపక్షాల వాదనలను విని, ఆపై ఆర్డర్ను ఏప్రిల్ 20కి రిజర్వ్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, ఇది రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత కేసు కాదంటూ సెషన్స్ కోర్టును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆశ్రయించారు. శిక్షపై స్టే విధించకపోతే తన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ పిటిషన్పై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్పీ మొగేరా తీర్పును ఈ నెల 20కి రిజర్వు చేశారు. ఈ కేసులో స్టే లభిస్తే రాహుల్ సభ్యత్వం పునరుద్ధరించేందుకు మార్గం సుగమం కానుంది.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో నేడు తీర్పు ఇవ్వనున్న కోర్టు
2019 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో రాహుల్ గాంధీ ‘మోదీ’ అనే ఇంటిపేరును ఉపయోగించి చేసిన వ్యాఖ్యకు సంబంధించినది ఈ కేసు. 2019 ఏప్రిల్లో కర్ణాటకలోని కోలార్లో జరిగిన ర్యాలీలో, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్, “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని అన్నారు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాహుల్ని దోషిగా నిర్ధారించిన తర్వాత, రాహుల్ని మార్చి 24న ఎంపీగా అనర్హులుగా ప్రకటించారు. ఈ రూలింగ్ ప్రకారం, ఏ ఎంపీ లేదా ఎమ్మెల్యే అయినా దోషిగా నిర్ధారించబడి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే ఆటోమేటిక్గా అనర్హులు అవుతారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!