Modi Surname Remark: రాహుల్ గాంధీ పిటిషన్పై సూరత్ కోర్టు నేడు తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Surname Remark: పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన పిటిషన్పై సూరత్ కోర్టు నేడు తన తీర్పును ప్రకటించనుంది. ఈ కేసులో దోషిగా తేలడంతో అప్పీల్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేతకు ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.మాజీ ఎంపీకి బెయిల్ మంజూరు చేస్తూనే, తన నేరారోపణపై స్టే విధించాలన్న కాంగ్రెస్ నాయకుడి విజ్ఞప్తిపై ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇది ఇరుపక్షాల వాదనలను విని, ఆపై ఆర్డర్ను ఏప్రిల్ 20కి రిజర్వ్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, ఇది రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత కేసు కాదంటూ సెషన్స్ కోర్టును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆశ్రయించారు. శిక్షపై స్టే విధించకపోతే తన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ పిటిషన్పై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్పీ మొగేరా తీర్పును ఈ నెల 20కి రిజర్వు చేశారు. ఈ కేసులో స్టే లభిస్తే రాహుల్ సభ్యత్వం పునరుద్ధరించేందుకు మార్గం సుగమం కానుంది.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో నేడు తీర్పు ఇవ్వనున్న కోర్టు
2019 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో రాహుల్ గాంధీ ‘మోదీ’ అనే ఇంటిపేరును ఉపయోగించి చేసిన వ్యాఖ్యకు సంబంధించినది ఈ కేసు. 2019 ఏప్రిల్లో కర్ణాటకలోని కోలార్లో జరిగిన ర్యాలీలో, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్, “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని అన్నారు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాహుల్ని దోషిగా నిర్ధారించిన తర్వాత, రాహుల్ని మార్చి 24న ఎంపీగా అనర్హులుగా ప్రకటించారు. ఈ రూలింగ్ ప్రకారం, ఏ ఎంపీ లేదా ఎమ్మెల్యే అయినా దోషిగా నిర్ధారించబడి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే ఆటోమేటిక్గా అనర్హులు అవుతారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!