Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కేసు.. శివలింగం కార్బన్ డేటింగ్పై విచారణకు సుప్రీం ఓకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదులో బయటపడిన శివలింగం వంటి నిర్మాణానికి ‘కార్బన్ డేటింగ్’ పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోని శివలింగం వయసును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూపక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కార్బన్ డేటింగ్ కు ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం విచారించేందుకు సుప్రీం అంగీకరించింది. జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ తన వాదనలను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహా, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారణాసిలోని మసీదులో శివలింగంగా పేర్కొనబడిన కట్టడం వయస్సును నిర్ణయించాలని మే 12న హైకోర్టు ఆదేశించింది.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
Read Also: Karnataka: డిప్యూటీ సీఎం దళితుడికి ఇవ్వకుంటే.. అధిష్టానానికి కాంగ్రెస్ లీడర్ వార్నింగ్..
కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదం గత ఏడాది కాలంగా నడుస్తోంది. గతేడాది వారణాసి స్థానిక కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం వంటి నిర్మాణం బయటపడింది. ఆ తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. వారణాసి జిల్లా కోర్టు అక్టోబర్ 14న కార్బన్ డేటింగ్ తో సహా శాస్త్రీయ పరిశోధనకు అనుమతిని తిరస్కరించింది. దీనిపై హిందూ తరుపు న్యాయవాది అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 12న కార్బన్ డేటింగ్ పరీక్షకు అనుమతి ఇచ్చింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే చేయాలని ఆదేశించింది.
మసీదు కూడా కాశీవిశ్వనాథ కాంప్లెక్స్ లో భాగమే అని మసీదు గోడలపై దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. దీనికి మసీదు కమిటీ వ్యతిరేకించింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదులో విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. అయితే గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. మసీదులో లభ్యమైన శివలింగ నిర్మాణం ఫౌంటెన్ అని ముస్లిం తరుపు వారు వాదిస్తున్నారు.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!