Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్ ‘‘బిల్లుల’’ అధికారాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..
- రాష్ట్రపతి, గవర్నర్ల ‘‘బిల్లుల’’ అధికారాలపై రానున్న స్పష్టత..
- గడువు విధింపుపై తీర్పు చెప్పనున్న సుప్రీంకోర్టు..
- 3 నెలలు నిర్ణయం తీసుకోకుంటే ఆమోదం పొందినట్లే అని గతంలో తీర్పు..
- దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు క్లియర్ చేసిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి అధికారాల గురించి ఈ రోజు సుప్రీంకోర్టు కీలక అభిప్రాయాన్ని వెల్లడించబోతోంది. బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై తీర్పు చెప్పనుంది. సెప్టెంబర్ నెలలో ఈ వివాదంపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోసం ఈ తీర్పు వెల్లడించనుంది.
Read Also: kaantha OTT : దుల్కర్–రానా నటించిన ‘కాంత’ ఓటీటీ రిలీజ్పై తాజా అప్డేట్
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
ఈ అంశాన్ని విచారించిన సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. రాజ్యాంగబద్ధమైన అధికారం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే సుప్రీంకోర్టు ‘‘పనిలేకుండా’’, ‘‘శక్తిహీనులై’’ ఉంటుందని కేంద్రం ఆశించకూడదని గవాయ్ సెప్టెంబర్ నెలలో స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ 8న ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ ఒక బిల్లును అనవసరంగా ఆలస్యం చేయకూడదని, బిల్లుల నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల గడువు విధించింది. ఈ తీర్పు తర్వాత, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతిని సంప్రదించింది. దీంతో ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టు సలహా కోసం పంపారు.
సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని బిల్లులకు ఒకే గడువు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీ బిల్లుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని, ఒకే రూల్ పనిచేయదని, కోర్టులు గవర్నర్ పనిని బలవంతంగా నియంత్రించకూడదని చెప్పింది. గవర్నర్లకు బిల్లులపై సంతకం చేయాలా.? వద్దా? అని నిర్ణయించే స్వేచ్ఛ ఉండాలని, ముఖ్యంగా బిల్లుల రాజ్యాంగబద్ధతను పరీక్షించే హక్కు గవర్నర్లకు ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
తాజావార్తలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!