తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ను ఉపసంహరించుకుని తగిన ఉపశమనం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి.. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
తిరునల్వేలి జిల్లాలోని మెయిన్ రోడ్డులోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రజా ఆర్చ్ ప్రవేశ ద్వారం దగ్గర కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. అయితే సుప్రీం కోర్టు పిటిషన్ను తోసిపుచ్చింది. ప్రజా ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు అనుమతిని నిరాకరించిన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఇటువంటి విగ్రహాల ఏర్పాటు కారణంగా తరచుగా ట్రాఫిక్ కష్టాలు ఏర్పడతాయని.. ఇది ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని గతంలో హైకోర్టు పేర్కొంది. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల హక్కులను కాపాడాలి. సుప్రీంకోర్టు అటువంటి అనుమతులను నిషేధించినప్పుడు రాష్ట్రం వాటిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయకూడదు.’’ అని న్యాయస్థానం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త.. కారణమిదే!
తమిళనాడు రాజకీయాలపై కరుణానిధి చెరగని ముద్ర వేశారు. దశాబ్దాల పాటు డీఎంకే పార్టీని నడిపారు. ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2018, ఆగస్టు 7న ఆయన మరణించారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నీ (40) లోక్సభ స్థానాల్లో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించారు. ప్రస్తుతం తమిళనాడులో కరుణానిధి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2026 ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.