Supreme Court: ప్రజా ధనాన్ని విగ్రహాలకు ఎలా ఖర్చు చేస్తారు? డీఎంకే ప్రభుత్వానికి చీవాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ను ఉపసంహరించుకుని తగిన ఉపశమనం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి.. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
తిరునల్వేలి జిల్లాలోని మెయిన్ రోడ్డులోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రజా ఆర్చ్ ప్రవేశ ద్వారం దగ్గర కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. అయితే సుప్రీం కోర్టు పిటిషన్ను తోసిపుచ్చింది. ప్రజా ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు అనుమతిని నిరాకరించిన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఇటువంటి విగ్రహాల ఏర్పాటు కారణంగా తరచుగా ట్రాఫిక్ కష్టాలు ఏర్పడతాయని.. ఇది ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని గతంలో హైకోర్టు పేర్కొంది. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల హక్కులను కాపాడాలి. సుప్రీంకోర్టు అటువంటి అనుమతులను నిషేధించినప్పుడు రాష్ట్రం వాటిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయకూడదు.’’ అని న్యాయస్థానం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. కూతురు ఎదురుగా భార్యను చంపిన భర్త.. కారణమిదే!
తమిళనాడు రాజకీయాలపై కరుణానిధి చెరగని ముద్ర వేశారు. దశాబ్దాల పాటు డీఎంకే పార్టీని నడిపారు. ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2018, ఆగస్టు 7న ఆయన మరణించారు. 2004 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నీ (40) లోక్సభ స్థానాల్లో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించారు. ప్రస్తుతం తమిళనాడులో కరుణానిధి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2026 ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!