Supreme Court: సుప్రీంకోర్టు సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ అత్యున్నత న్యాయస్థానం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఏకంగా 44 తీర్పులిచ్చింది. ఇది ఈమధ్య కాలంలో ఒక రికార్డు కావటం విశేషం. మే నెల 23 నుంచి జూలై 10 వరకు సుప్రీంకోర్టుకు సమ్మర్ హాలిడేస్ కాగా మొన్న 11వ తేదీన తిరిగి ప్రారంభమైంది. ఆ రోజే ఈ అత్యధిక తీర్పులు వెలువడటం గమనార్హం. 19 రోజుల పాటు సెలవుల్లో ఉండటంతో వివిధ అంశాలపై లోతుగా అధ్యయనం చేయటానికి, జడ్జిమెంట్లను రాతపూర్వకంగా ఇవ్వటానికి తీరిక సమయం దొరికిందని జడ్జిలు పేర్కొన్నారు.
ఈ తీర్పుల్లో విదేశాలకు నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలు, లోకల్ చట్టాలు, క్రిమినల్ అప్పీల్స్, సివిల్ సూట్లు, బ్యాంకింగ్, బిజినెస్ ఇష్యూస్, కోర్టు ధిక్కారం, కాంట్రాక్టులు తదితర అంశాలు ఉన్నాయి. కాగా ఈ 44 తీర్పుల్లో 20 తీర్పులను జస్టిస్ ఎంఆర్షా అనే ఒక్క జడ్జే ఇచ్చారని తెలిపారు. సెలవుల్లో సైతం తమ విలువైన సమయాన్ని కేసుల పరిష్కారం కోసమే కేటాయిస్తున్న న్యాయమూర్తులను మెచ్చుకోవాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అన్నారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
తీర్పు చెప్పటం అంత తేలిక కాదని, ఒక్కో కేసు వెనక ఎంతో స్టడీ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమర్తి జస్టిస్ ఎన్వీ రమణ గతంలో పేర్కొన్నారు. కోర్టు పనివేళలు ముగిశాక ఇంటి దగ్గర సైతం పలువురు న్యాయమూర్తులు కేసులతో కుస్తీలు పడుతుంటారని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తారని, మార్గదర్శకంగా తీసుకుంటారని తెలిపారు. సరైన కసరత్తు చేయకుండా తీర్పు చెబితే విమర్శల పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కొన్ని కీలక కేసుల్లో(దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవాటిలో) ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కూడా న్యాయమూర్తులు జడ్జిమెంట్లను రిజర్వ్ చేస్తుంటారు. తీర్పు చెప్పేందుకు సరైన సమయాన్ని, సందర్భాన్ని ఎంచుకుంటారు. అందుకే అవి ఆలస్యమవుతూ ఉంటాయి. అయోధ్యలో రామాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పే ముందు ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తును పటిష్టం చేశారు. డేరా బాబాకు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించే ముందు ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..