Supreme Court: సుప్రీంకోర్టు సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ అత్యున్నత న్యాయస్థానం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఏకంగా 44 తీర్పులిచ్చింది. ఇది ఈమధ్య కాలంలో ఒక రికార్డు కావటం విశేషం. మే నెల 23 నుంచి జూలై 10 వరకు సుప్రీంకోర్టుకు సమ్మర్ హాలిడేస్ కాగా మొన్న 11వ తేదీన తిరిగి ప్రారంభమైంది. ఆ రోజే ఈ అత్యధిక తీర్పులు వెలువడటం గమనార్హం. 19 రోజుల పాటు సెలవుల్లో ఉండటంతో వివిధ అంశాలపై లోతుగా అధ్యయనం చేయటానికి, జడ్జిమెంట్లను రాతపూర్వకంగా ఇవ్వటానికి తీరిక సమయం దొరికిందని జడ్జిలు పేర్కొన్నారు.
ఈ తీర్పుల్లో విదేశాలకు నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందాలు, లోకల్ చట్టాలు, క్రిమినల్ అప్పీల్స్, సివిల్ సూట్లు, బ్యాంకింగ్, బిజినెస్ ఇష్యూస్, కోర్టు ధిక్కారం, కాంట్రాక్టులు తదితర అంశాలు ఉన్నాయి. కాగా ఈ 44 తీర్పుల్లో 20 తీర్పులను జస్టిస్ ఎంఆర్షా అనే ఒక్క జడ్జే ఇచ్చారని తెలిపారు. సెలవుల్లో సైతం తమ విలువైన సమయాన్ని కేసుల పరిష్కారం కోసమే కేటాయిస్తున్న న్యాయమూర్తులను మెచ్చుకోవాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అన్నారు.
Also Read
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
తీర్పు చెప్పటం అంత తేలిక కాదని, ఒక్కో కేసు వెనక ఎంతో స్టడీ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమర్తి జస్టిస్ ఎన్వీ రమణ గతంలో పేర్కొన్నారు. కోర్టు పనివేళలు ముగిశాక ఇంటి దగ్గర సైతం పలువురు న్యాయమూర్తులు కేసులతో కుస్తీలు పడుతుంటారని, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తారని, మార్గదర్శకంగా తీసుకుంటారని తెలిపారు. సరైన కసరత్తు చేయకుండా తీర్పు చెబితే విమర్శల పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కొన్ని కీలక కేసుల్లో(దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవాటిలో) ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కూడా న్యాయమూర్తులు జడ్జిమెంట్లను రిజర్వ్ చేస్తుంటారు. తీర్పు చెప్పేందుకు సరైన సమయాన్ని, సందర్భాన్ని ఎంచుకుంటారు. అందుకే అవి ఆలస్యమవుతూ ఉంటాయి. అయోధ్యలో రామాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పే ముందు ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తును పటిష్టం చేశారు. డేరా బాబాకు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించే ముందు ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!