Supreme Court: జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు
- నోట్ల కట్టల వ్యవహారం కేసు సుప్రీంకోర్టులో విచారణ
- జస్టిస్ వర్మ పిటిషన్ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోట్ల కట్టల వ్యవహారం కేసు నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తప్పుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తిగా తనను తొలగించాలని మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని జస్టిస్ యశ్వంత వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని జస్టిస్ వర్మ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అత్యవసర విచారణ కోసం సీజేఐ ముందు ప్రస్తావించారు. ‘‘నేను కూడా కమిటీలో సభ్యుడిని కాబట్టి ఈ కేసును విచారించడం నాకు సాధ్యం కాదు. మేము దానిని జాబితా చేస్తాము.’’ అని సీజేఐ గవాయ్ అన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ఒక బెంచ్ను ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.
ఇది కూడా చదవండి: HHVM : వామ్మో.. పవన్ స్టార్ రంగంలోకి దిగితే ఇలా ఉంటుందా
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
మార్చి 15న వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలార్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు కనిపించాయి. అవి దాదాపుగా రూ.15 కోట్లు ఉంటాయని అధికారులు భావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక సిబ్బంది పైఅధికారులకు పంపించారు. ఆ ఫొటోలను అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నాకు పంపించారు. అనంతరం సుప్రీంకోర్టు.. విచారణ ప్యానెల్ ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం జస్టిస్ వర్మ దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని నిర్ధారించింది. దీంతో అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా .. వర్మపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని పార్లమెంట్ను కోరారు. ఈ నేపథ్యంలో వర్మను పదవి నుంచి తొలగించడానికి పార్లమెంట్లో అభిశంసన తీర్మానం తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: India-Pakistan: అప్పుల కోసం పరుగులు పెడుతోంది.. యూఎన్లో పాక్పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
అయితే ఇంట్లో దొరికిన నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వర్మ తెలిపారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని ఖండించారు. ఇందులో ఏదో కుట్ర జరిగిందని పేర్కొన్నారు. ప్యానెల్ ఇచ్చిన రిపోర్టును సవాల్ చేస్తూ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ విచారణ నుంచి చీఫ్ జస్టిస్ గవాయ్ తప్పుకున్నారు. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!