Supreme Court: తమిళనాడులో అవయవాల అక్రమ రవాణా కేసు.. సీబీఐ వద్దు సిట్తోనే విచారణ
- తమిళనాడులో అవయవాల అక్రమ రవాణా కేసు..
- సిట్ లోని అధికారులను మార్చాలని ప్రభుత్వం వినతి..
- సిట్ తోనే విచారణ, సీబీఐకి ఇవ్వడం కుదరదు: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అవయవాల అక్రమ రవాణా, అక్రమ కిడ్ని మార్పిడి కేసులపై సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు ఈరోజు ( అక్టోబర్ 10న) నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎలాంటి జోక్యానికి అర్హమైనది కాదని, దాని పరిశీలనలు ఇతర అధికారుల పనితీరు లేదా ప్రవర్తనపై ఎటువంటి ప్రభావం చూపవని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక, సిట్ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు, దాని కూర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని తమిళనాడు సర్కార్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. సిట్ కు ఎంపికైన అధికారులు వేర్వేరు జిల్లాలకు చెందినవారు, దీని వల్ల వారు ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టమవుతుంది.. విచారణ సమయంలో సిట్ లోని అధికారులు 200–300 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు.
Read Also: IND vs WI: స్లో అండ్ స్టడీగా టీమిండియా బ్యాటింగ్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే?
Also Read
అయితే, వాస్తవానికి సిట్ (SIT) రాష్ట్రానికి అనుకూలంగా ఏర్పడిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ సిట్ లేదా సీబీఐ దర్యాప్తును కోరింది.. న్యాయస్థానం మొదట్లో ‘ సీబీఐ లేదు, సిట్ను పరిశీలిద్దామని పేర్కొనింది. సిట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తెలిపింది. ఇక, సిట్ కూర్పును మార్చడానికి తాము అంగీకరించబోమన్నారు. అలాగే, హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) సిట్ కోసం అధికారులను నియమించడానికి “ఇష్టపడటం లేదు” అని హైకోర్టు పేర్కొనడంపై అభ్యంతరంగా ఉందన్నారు. AAG సూచనలను పొందడానికి మాత్రమే సమయం కోరిందని లూథ్రా వాదించారు.
Read Also: Stranger Things : ఆ క్రేజీ సిరీస్ కి షాకింగ్ రన్ టైం తో ఒకో ఎపిసోడ్?
ఇక, సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మేము దీని గురించి ఆలోచించం.. మనం ఏదైనా చెబితే, అది ఒక సమస్యగా మారుతుంది అని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ దశలో విచారణ సిట్తోనే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!