Supreme Court: తమిళనాడులో అవయవాల అక్రమ రవాణా కేసు.. సీబీఐ వద్దు సిట్తోనే విచారణ
- తమిళనాడులో అవయవాల అక్రమ రవాణా కేసు..
- సిట్ లోని అధికారులను మార్చాలని ప్రభుత్వం వినతి..
- సిట్ తోనే విచారణ, సీబీఐకి ఇవ్వడం కుదరదు: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అవయవాల అక్రమ రవాణా, అక్రమ కిడ్ని మార్పిడి కేసులపై సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు ఈరోజు ( అక్టోబర్ 10న) నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎలాంటి జోక్యానికి అర్హమైనది కాదని, దాని పరిశీలనలు ఇతర అధికారుల పనితీరు లేదా ప్రవర్తనపై ఎటువంటి ప్రభావం చూపవని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక, సిట్ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు, దాని కూర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని తమిళనాడు సర్కార్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. సిట్ కు ఎంపికైన అధికారులు వేర్వేరు జిల్లాలకు చెందినవారు, దీని వల్ల వారు ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టమవుతుంది.. విచారణ సమయంలో సిట్ లోని అధికారులు 200–300 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు.
Read Also: IND vs WI: స్లో అండ్ స్టడీగా టీమిండియా బ్యాటింగ్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే?
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
అయితే, వాస్తవానికి సిట్ (SIT) రాష్ట్రానికి అనుకూలంగా ఏర్పడిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ సిట్ లేదా సీబీఐ దర్యాప్తును కోరింది.. న్యాయస్థానం మొదట్లో ‘ సీబీఐ లేదు, సిట్ను పరిశీలిద్దామని పేర్కొనింది. సిట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తెలిపింది. ఇక, సిట్ కూర్పును మార్చడానికి తాము అంగీకరించబోమన్నారు. అలాగే, హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) సిట్ కోసం అధికారులను నియమించడానికి “ఇష్టపడటం లేదు” అని హైకోర్టు పేర్కొనడంపై అభ్యంతరంగా ఉందన్నారు. AAG సూచనలను పొందడానికి మాత్రమే సమయం కోరిందని లూథ్రా వాదించారు.
Read Also: Stranger Things : ఆ క్రేజీ సిరీస్ కి షాకింగ్ రన్ టైం తో ఒకో ఎపిసోడ్?
ఇక, సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మేము దీని గురించి ఆలోచించం.. మనం ఏదైనా చెబితే, అది ఒక సమస్యగా మారుతుంది అని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ దశలో విచారణ సిట్తోనే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?