Supreme Court: తమిళనాడులో అవయవాల అక్రమ రవాణా కేసు.. సీబీఐ వద్దు సిట్తోనే విచారణ
- తమిళనాడులో అవయవాల అక్రమ రవాణా కేసు..
- సిట్ లోని అధికారులను మార్చాలని ప్రభుత్వం వినతి..
- సిట్ తోనే విచారణ, సీబీఐకి ఇవ్వడం కుదరదు: సుప్రీంకోర్టు
Supreme Court: తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అవయవాల అక్రమ రవాణా, అక్రమ కిడ్ని మార్పిడి కేసులపై సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు ఈరోజు ( అక్టోబర్ 10న) నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎలాంటి జోక్యానికి అర్హమైనది కాదని, దాని పరిశీలనలు ఇతర అధికారుల పనితీరు లేదా ప్రవర్తనపై ఎటువంటి ప్రభావం చూపవని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక, సిట్ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు, దాని కూర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని తమిళనాడు సర్కార్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. సిట్ కు ఎంపికైన అధికారులు వేర్వేరు జిల్లాలకు చెందినవారు, దీని వల్ల వారు ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టమవుతుంది.. విచారణ సమయంలో సిట్ లోని అధికారులు 200–300 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు.
Read Also: IND vs WI: స్లో అండ్ స్టడీగా టీమిండియా బ్యాటింగ్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే?
Also Read
అయితే, వాస్తవానికి సిట్ (SIT) రాష్ట్రానికి అనుకూలంగా ఏర్పడిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ సిట్ లేదా సీబీఐ దర్యాప్తును కోరింది.. న్యాయస్థానం మొదట్లో ‘ సీబీఐ లేదు, సిట్ను పరిశీలిద్దామని పేర్కొనింది. సిట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తెలిపింది. ఇక, సిట్ కూర్పును మార్చడానికి తాము అంగీకరించబోమన్నారు. అలాగే, హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) సిట్ కోసం అధికారులను నియమించడానికి “ఇష్టపడటం లేదు” అని హైకోర్టు పేర్కొనడంపై అభ్యంతరంగా ఉందన్నారు. AAG సూచనలను పొందడానికి మాత్రమే సమయం కోరిందని లూథ్రా వాదించారు.
Read Also: Stranger Things : ఆ క్రేజీ సిరీస్ కి షాకింగ్ రన్ టైం తో ఒకో ఎపిసోడ్?
ఇక, సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మేము దీని గురించి ఆలోచించం.. మనం ఏదైనా చెబితే, అది ఒక సమస్యగా మారుతుంది అని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ దశలో విచారణ సిట్తోనే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో