Breaking News: “ఎలక్టోరల్ బాండ్ స్కీమ్”పై దర్యాప్తు బృందం ఏర్పాటుకి నిరాకరించిన సుప్రీంకోర్టు..
- ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సిట్ ఏర్పాటుకు సుప్రీం నో..
- ఎన్నికల ముందు సంచలనమైన స్కీమ్..
- సుప్రీం ఆదేశాలతో రద్దు చేసిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News: లోక్సభ ఎన్నికల ముందు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పథకంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల ద్వారా కార్పొరేట్లు మరియు రాజకీయ పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాట్లకు సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఫిబ్రవరిలో, రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపేయాలని ఎస్బీఐని ఆదేశించింది.
రిటైర్డ్ జస్టిస్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు శుక్రవారం కోట్టేసింది. ‘‘చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాల ఆధారంగా అనుసరించాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం చట్టంలోని అందుబాటులో ఉన్న పరిష్కారాలు విఫమైనప్పుడు మాత్రమే కోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పింది.
Also Read
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
Read Also: Breaking News: “ఎలక్టోరల్ బాండ్ స్కీమ్”పై దర్యాప్తు బృందం ఏర్పాటుకి నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేశారు. లోక్సభ ఎన్నికలకు వారాల ముందు ఒక సంచలన తీర్పులో, రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని నిధులు ఓటర్ల పారదర్శకత హక్కును ఉల్లంఘించాయని కోర్టు పేర్కొంది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ మాట్లాడూతూ.. ఈకేసులో ప్రభుత్వాల ప్రమేయం ఉందని, అధికార పార్టీ, అగ్ర కార్పొరేట్ సంస్థల ప్రమేయం ఉందని, ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇది సాధారణ అవినీతి కేసు కాదని, భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమై ఆర్థిక కుంభకోణాల్లో ఒకటని చెప్పారు. రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయిస్తే తప్పా, ఈ కేసులో విషయాలు వెలుగులోకి రావని చెప్పారు.
కోర్టు ఈ వాదనలు విన్నప్పటికీ సిట్ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. ‘‘మేము వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించాము. మేము పథకాన్ని రద్దు చేశాము. ఇప్పుడు సిట్ ఏమి దర్యాప్తు చేస్తుంది..? ’’ అని కోర్టు ప్రశ్నించింది. చట్టంలోని పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు మనం సిట్ని ఏర్పాటు చేయవచ్చా..? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!