Breaking News: “ఎలక్టోరల్ బాండ్ స్కీమ్”పై దర్యాప్తు బృందం ఏర్పాటుకి నిరాకరించిన సుప్రీంకోర్టు..
- ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సిట్ ఏర్పాటుకు సుప్రీం నో..
- ఎన్నికల ముందు సంచలనమైన స్కీమ్..
- సుప్రీం ఆదేశాలతో రద్దు చేసిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News: లోక్సభ ఎన్నికల ముందు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పథకంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల ద్వారా కార్పొరేట్లు మరియు రాజకీయ పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాట్లకు సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఫిబ్రవరిలో, రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపేయాలని ఎస్బీఐని ఆదేశించింది.
రిటైర్డ్ జస్టిస్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు శుక్రవారం కోట్టేసింది. ‘‘చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాల ఆధారంగా అనుసరించాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం చట్టంలోని అందుబాటులో ఉన్న పరిష్కారాలు విఫమైనప్పుడు మాత్రమే కోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పింది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Breaking News: “ఎలక్టోరల్ బాండ్ స్కీమ్”పై దర్యాప్తు బృందం ఏర్పాటుకి నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేశారు. లోక్సభ ఎన్నికలకు వారాల ముందు ఒక సంచలన తీర్పులో, రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని నిధులు ఓటర్ల పారదర్శకత హక్కును ఉల్లంఘించాయని కోర్టు పేర్కొంది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ మాట్లాడూతూ.. ఈకేసులో ప్రభుత్వాల ప్రమేయం ఉందని, అధికార పార్టీ, అగ్ర కార్పొరేట్ సంస్థల ప్రమేయం ఉందని, ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇది సాధారణ అవినీతి కేసు కాదని, భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమై ఆర్థిక కుంభకోణాల్లో ఒకటని చెప్పారు. రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయిస్తే తప్పా, ఈ కేసులో విషయాలు వెలుగులోకి రావని చెప్పారు.
కోర్టు ఈ వాదనలు విన్నప్పటికీ సిట్ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. ‘‘మేము వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించాము. మేము పథకాన్ని రద్దు చేశాము. ఇప్పుడు సిట్ ఏమి దర్యాప్తు చేస్తుంది..? ’’ అని కోర్టు ప్రశ్నించింది. చట్టంలోని పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు మనం సిట్ని ఏర్పాటు చేయవచ్చా..? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?