Sunetra Pawar: బారామతి చరిత్రలో సరికొత్త అధ్యాయం.. భర్త మెజార్టీని క్రాస్ చేసిన సునేత్రా పవార్!
- బారామతిలో సునేత్రా పవార్ ప్రభంజనం..
- 2.19 లక్షల ఓట్ల రికార్డు మెజారిటీతో సరికొత్త చరిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి అసెంబ్లీ స్థానం మరోసారి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి, ఎన్సీసీ అభ్యర్థి సునేత్రా పవార్ కళ్లు చెదిరే రీతిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
రికార్డులన్నీ బద్దలు.. ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు!
బారామతి అసెంబ్లీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సునేత్రా పవార్కు ఏకపక్షంగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆమెకు సుమారు 2.19 లక్షల ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి కనీసం 1,000 ఓట్లు కూడా దాటలేదు. బరిలో నిలిచిన రెండు డజన్ల మంది స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి కేవలం 5,000 ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. 2024లో అజిత్ పవార్ సాధించిన లక్ష ఓట్ల మెజారిటీ రికార్డును సునేత్రా పవార్ ఈ విజయంతో క్రాస్ చేశారు. నిజానికి అజిత్ పవార్ ఆకస్మిక మరణం బారామతి ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనపై ఉన్న గౌరవంతో ప్రధాన రాజకీయ పార్టీలేవీ సునేత్రా పవార్కు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టలేదు. కేవలం స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. అజిత్ పవార్ పట్ల ఉన్న భావోద్వేగ బంధం, సానుభూతి పవనాలతో పాటు సునేత్రా పవార్ క్షేత్రస్థాయిలో చేసిన ప్రచారం ఆమెకు ఈ భారీ విజయాన్ని కట్టబెట్టాయి.
Also Read
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
- Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
6 దశాబ్దాల పవార్ కోట..
1967 నుంచి బారామతి అంటే పవార్ కుటుంబమే అనేలా ఇక్కడి రాజకీయాలు సాగుతున్నాయి. తొలుత శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని సునేత్రా పవార్ ముందుకు కొనసాగించబోతున్నారు. విజయం అనంతరం సునేత్రా పవార్ భావోద్వేగానికి లోనయ్యారు. “ఈ విజయం బారామతి ప్రజలది. అజిత్ పవార్ నెరవేర్చని కలలను నేను పూర్తి చేస్తాను. ఆయన ఆశయాలకు అనుగుణంగా బారామతి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను” అని ఆమె ప్రకటించారు. ఈ విజయంతో బారామతి వ్యాప్తంగా ఎన్సీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?