ICMR Research: పోస్టు కోవిడ్ మరణాలపై అధ్యయనం.. రెంటు అధ్యయనాలు చేపడుతున్న ఐసీఎంఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICMR Research: కోవిడ్ తరువాత జరిగిన మరణాలపై అధ్యయనం చేయాలనిఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెండు అధ్యయనాలను చేపట్టాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది. కోవిడ్ మూలంగా చనిపోయిన వారు కాకుండా.. కోవిడ్ మొత్తం ముగిసి పోయిన తరువత మరణించిన వారి పోస్టు మార్టమ్ రిపోర్టులను పరిశీలించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. భారత్ తో పాటు పలు దేశాల్ని అతలా కుతలం చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం చాలా వరకు తగ్గినా పోస్టు కోవిడ్ మరణాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆకస్మిక మరణాలు ఇండియాతోపాటు పలు దేశాల్ని కలవరపెడుతున్నాయి. గతంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న యువతలో ఆకస్మికంగా మరణాలు చోటు చేసుకోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. దేశంలో ఇలాంటి కేసులు కూడా పెరుగుతుండటంతో కేంద్రం దీనిపై దృష్టిసారించింది. ఇందుకు సంబంధించి ఐసీఎంఆర్ భారత్ లో కోవిడ్ తర్వాత యువకుల ఆకస్మిక మరణాలకు కారణాలను తెలుసుకోవడం కోసం రెండు అధ్యయనాలను నిర్వహించాలని నిర్ణయించింది.
Read also: PM Modi: డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుంది
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ 18 నుండి 45 సంవత్సరాల మద్య వయస్సు గల వ్యక్తుల్లో కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత చోటు చేసుకుంటున్న మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన డబ్ల్యూహెచ్ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ఎలాంటి కారణాలు లేకుండా మరణాలు పెరుగుతున్నాయని అందుకే ఈ అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎటువంటి కారణాలు లేకుండా దేశంలోని యువతలో చోటు చేసుకుంటున్న మరణాలపై ఐసీఎంఆర్ రెండు అధ్యయనాలు చేయనుందని.. ఈ అధ్యయనాలు కోవిడ్ -19 వ్యాప్తి పరిణామాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని చెబుతున్నారు. ఇందుఉ కారణాలు తెలిస్తే రాబోయే కాలంలో జరిగే మరణాలను నిరోధించే అవకాశం ఉంటుందని ఐసీఎంఆర్ స్పష్టం చేస్తోంది. ఇతర తీవ్ర వ్యాధులు ఏమీ లేకున్నప్పటికీ యువతలో చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలపైనే ఈ అధ్యయనాలు సాగుతాయని వారు స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో పోస్టు కోవిడ్తో మరణించిన 50 మృతదేహాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా 100 మృతదేహాలపై ఈ అధ్యయనాలు చేయాలని ఐసీఎంఆర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా పోస్టుమార్టంల రిపోర్ట్ లను, కోవిడ్ తర్వాత పరిస్ధితులతో పోల్చి చూడటం ద్వారా కారణాలు తెలుసుకోనున్నట్టు ఐసీఎంఆర్ చెబుతోంది. మరొక అధ్యయనంలో 18 నుండి 45 సంవత్సరాల వయస్సులో ఆకస్మిక మరణాల డేటాను తీసుకుని.. వారు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఏ జరిగిందో ఐసీఎంఆర్ నిపుణులు తెలుసుకుంటున్నారు. రిపోర్టుల ఆధారంగా కారణాలను పరిశీలించనున్నారు.
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!