PM Modi: డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రోజు రోజుకు ఆధునిక సాంకేతికత పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత కొత్తదనంతో వస్తే.. సైబర్ నేరాలు కూడా అంతే త్వరగా వస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం అసరమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ శనివారం వీడియో మెసేజ్ ద్వారా ప్రసంగించారు.
Read also:Viral Video : ఓరి నాయనో.. ఈ బుడ్డోళ్ల కష్టాలు పగోడికి కూడా రాకూడదు..
Also Read
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
భారత దేశంలో 85 కోట్ల మంది మొబైల్ డేటాను ఉపయోగించుకుంటున్నారని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే తక్కువ ధరలకు డేటాను అందిస్తున్న దేశం ఇండియానేనని అన్నారు. భారత దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విస్తృతి, వేగం, పరిధులను ప్రధాని వివరించారు. 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా పథకం మూలంగా గత తొమ్మిదేళ్లలో భారత దేశంలో డిజిటల్ పరివర్తన జరిగిందని స్పష్టం చేశారు. పరిపాలన తీరును మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్ వల్ల వ్యవస్థలో లోపాలను అరికట్టగలుగుతున్నామని ప్రధాని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదును (డీబీటీ) అందజేయగలుగుతున్నట్లు తెలిపారు. పన్నుల వ్యవస్థను పూర్తిగా డిజిటైజ్ చేయడం వల్ల పారదర్శకత వృద్ధి చెందుతోందని, ఈ-గవర్నెన్స్ జరుగుతోందని తెలిపారు. వర్కింగ్ గ్రూప్ రూపొందిస్తున్న జీ20 వర్చువల్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపోజిటరీ పట్ల ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కామన్ ఫ్రేమ్వర్క్ రూపకల్పన పురోగతిలో ఉందని మోడీ చెప్పారు. అందరికీ న్యాయమైన, పారదర్శకత కలిగిన, జవాబుదారీతనంతో కూడిన డిజిటల్ ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో జన్ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటిందని.. ఈ ఖాతాల్లో 67 శాతం ఖాతాలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిందని గుర్తు చేశారు. పెద్దమొత్తంలో జన్ధన్ ఖాతాలు తెరవడం పట్ల ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఖాతాల్లో సగం ఖాతాలు నారీ శక్తికి సంబంధించినవని ప్రధాని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!