PM Modi: డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రోజు రోజుకు ఆధునిక సాంకేతికత పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత కొత్తదనంతో వస్తే.. సైబర్ నేరాలు కూడా అంతే త్వరగా వస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం అసరమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ శనివారం వీడియో మెసేజ్ ద్వారా ప్రసంగించారు.
Read also:Viral Video : ఓరి నాయనో.. ఈ బుడ్డోళ్ల కష్టాలు పగోడికి కూడా రాకూడదు..
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
భారత దేశంలో 85 కోట్ల మంది మొబైల్ డేటాను ఉపయోగించుకుంటున్నారని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే తక్కువ ధరలకు డేటాను అందిస్తున్న దేశం ఇండియానేనని అన్నారు. భారత దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విస్తృతి, వేగం, పరిధులను ప్రధాని వివరించారు. 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా పథకం మూలంగా గత తొమ్మిదేళ్లలో భారత దేశంలో డిజిటల్ పరివర్తన జరిగిందని స్పష్టం చేశారు. పరిపాలన తీరును మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్ వల్ల వ్యవస్థలో లోపాలను అరికట్టగలుగుతున్నామని ప్రధాని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదును (డీబీటీ) అందజేయగలుగుతున్నట్లు తెలిపారు. పన్నుల వ్యవస్థను పూర్తిగా డిజిటైజ్ చేయడం వల్ల పారదర్శకత వృద్ధి చెందుతోందని, ఈ-గవర్నెన్స్ జరుగుతోందని తెలిపారు. వర్కింగ్ గ్రూప్ రూపొందిస్తున్న జీ20 వర్చువల్ గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపోజిటరీ పట్ల ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కామన్ ఫ్రేమ్వర్క్ రూపకల్పన పురోగతిలో ఉందని మోడీ చెప్పారు. అందరికీ న్యాయమైన, పారదర్శకత కలిగిన, జవాబుదారీతనంతో కూడిన డిజిటల్ ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేయడానికి దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో జన్ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటిందని.. ఈ ఖాతాల్లో 67 శాతం ఖాతాలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిందని గుర్తు చేశారు. పెద్దమొత్తంలో జన్ధన్ ఖాతాలు తెరవడం పట్ల ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఖాతాల్లో సగం ఖాతాలు నారీ శక్తికి సంబంధించినవని ప్రధాని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!