Vande Bharat Express: వందేభారత్, గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం 130 కి.మీకి తగ్గింపు..
- వందేభారత్
- గతిమాన్ రైళ్ల వేగాన్ని తగ్గించిన రైల్వే..
- కాంచనజంగా ప్రమాదంతో కీలక నిర్ణయం..
- 160 కి.మీ నుంచి 130 కి.మీకి వేగం తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: సెమీ హైస్పీడ్ రైళ్ల వేగాన్ని తగ్గిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకు వందేభారత్, గతిమాన్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేగాన్ని 160 కి.మీ నుంచి 130 కి.మీకి తగ్గించారు. ప్రస్తుతం హజరత్ నిజాముద్దీన్(న్యూఢిల్లీ)- ఆగ్రా రైలు మార్గంలో ట్రాక్ పరిస్థితులు వేగానికి అనుకూలంగా ఉండటంతో ఈ మార్గంలోనే ఈ రెండు రైళ్ల గంటకు రూ. 160 కి.మీ వేగంగా నడుస్తున్నాయి.
READ ALSO: Asaduddin Owaisi: ఓవైసీ ఇంటిపై దాడి.. ‘‘జై శ్రీరాం, భారత్ మాతా కీ జై’’ నినాదాలు..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
జూన్ 24న, రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిగ్నల్) ఎన్సీఆర్ జోన్ జనరల్ మేనేజర్కి లేఖ జారీ చేసి, రైళ్ల వేగాన్ని పరిశీలించినట్లు చెప్పారు. జోనల్ రైల్వేలు IR-ATP కవాచ్ విభాగంలో పనులను వేగవంతం చేయాలని మరియు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్ పనిచేసే వరకు, రైళ్లను గరిష్టంగా 130 kmph వేగంతో నడపాలని నిర్ణయించినట్లు లేఖలో పేర్కొన్నారు. వేగాన్ని తగ్గించేందుకు రైల్వే బోర్డు మెంబర్ ఇన్ఫ్రా ఆమోదించినట్లు లేఖలో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలుని వెనకనుంచి ఢీకొట్టడంతో 10 మంది మరణించిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వేగ పరిమితి జూన్ 25 నుంచి అమలులోకి వచ్చింది. న్యూఢిల్లీ-రాణి కమలాపతి వందే భారత్ ఎక్స్ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్-ఖజురహో వందే భారత్ ఎక్స్ప్రెస్, న్యూ ఢిల్లీ-విరాంఘానా ఝాన్సీ గతిమాన్ ఎక్స్ప్రెస్ల గురించి లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!