Kanwar Yatra: కన్వర్ యాత్ర బస్సుకు కరెంట్షాక్.. ఐదుగురు శివ భక్తులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanwar Yatra: శివ భక్తుల కన్వరియాల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. శివ భక్తులతో యాత్రకు వెళుతున్న బస్సు విద్యుత్ ఘాతానికి గురైంది. బస్సులో ఉన్న వారిలో ఐదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. బస్సుకు హైటెన్షన్ వైర్లు తగలడంతో బస్సులో ఉన్న శివ భక్తుల్లో అక్కడికక్కడే ఒకరు మరణించగా.. చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దక్షిణ ఉత్తరప్రదేశ్లోని మిరట్ జిల్లా, భవాన్పురీ రాలీ చౌహాన్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read also: Tamilnadu: మీ కోరికలు వెంటనే తీరాలంటే ఈ గుడికి ఒక్కసారి వెళ్ళాల్సిందే..!
Also Read
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
శివుని భక్తులుగా పేరుగాంచిన కన్వరియాలు యాత్రకు వెళ్లారు. హరిద్వార్లో గంగాజలంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు.. భవాన్పురీ గ్రామానికి చేరుకోగానే కిందికి వంగి ఉన్న హై టెన్షన్ వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో బస్సులో ఉన్న యాత్రికులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అప్రమత్తమైన గ్రామస్తులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ సరఫరాను నిలిపివేయించారు. కానీ అప్పటికే ప్రమాదం తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనకు బాధ్యత వహించాలంటూ నిరసన చేపట్టారు. హై టెన్షన్ వైర్లు కిందికి ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా సరిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. కన్వార్ యాత్ర భారతదేశంలో అతిపెద్ద మతపరమైన యాత్రల్లో ఒకటి. ప్రతీ ఏడాది ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, చంఢీగర్, ఒడిశా, జార్ఖండ్ నుంచి కోటీ ఇరవై లక్షల మంది భక్తులు హాజరవుతారు. కన్వారియాలు కాశాయ వస్ర్తాలు ధరించి చెప్పులు లేకుండా యాత్రకు వెళతారు.
తాజావార్తలు
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!