Sonia Gandhi: కూతురి కోసం రంగంలోకి సోనియా గాంధీ..
- కూతురి కోసం రంగంలోకి సోనియా గాంధీ..
- ప్రియాంకా గాంధీ తరుపున సోనియా ప్రచారం..
- వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంకా గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, తన కూతురు ప్రియాంకాగా గాంధీ కోసం ప్రచారం చేయబోతున్నారు. వయనాడ్ లోక్సభా స్థానం నుంచి ప్రియాంకా అరంగ్రేటం చేయబోతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్బరేలీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత, వయనాడ్ లోక్సభా స్థానానికి రాజీనామా చేయడంతో మళ్లీ అక్కడ బై ఎలక్షన్ జరగబోతున్నాయి. కేరళలోని పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ స్థానాలతో పాటు వయనాడ్ లోక్సభా స్థానానికి నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
చాలా ఏళ్ల తర్వాత సోనియా గాంధీ కేరళకు వెళ్తున్నారు. మంగళవారం జరగబోయే రోడ్ షోలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పాల్గొంటున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత.. కేరళ కాంగ్రెస్ ప్రియాంకాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించింది. ఆమె వయనాడ్ నుంచి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) అభ్యర్థిగా ప్రకటించింది.
Also Read
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
Read Also: AP Govt: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కి కంచుకోటగా ఉన్న వయనాడ్ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ 5 లక్షలకు పైగా మెజారిటీలో గెలుస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అలప్పుజా ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వయనాడ్లో ప్రియాంకాగాంధీ ప్రచారాన్ని సమన్వయం చేయనున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో 4,31,770 ఓట్లతో పోలిస్తే 2024లో రాహుల్ గాంధీ మెజారిటీ తగ్గింది.
ఇదిలా ఉంటే, ప్రియాంకాగాంధీపై పోటీ చేయబోతున్న అభ్యర్థుల్ని బీజేపీ, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్)లు ప్రకటించాయి. సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకేరిని రంగంలోకి దింపింది. బీజేపీ నుంచి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!