NTV Telugu Site icon

Sonia Gandhi: ముగిసిన సోనియాగాంధీ ఈడీ విచారణ.. రేపు కూడా మరోసారి..

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగ‌ళ‌వారం 6 గంట‌ల పాటు విచారించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ ద‌ఫా విచార‌ణ‌కు హాజ‌నైన సోనియా గాంధీ తాజాగా మంగ‌ళ‌వారం మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మంగ‌ళ‌వారం ఉద‌యం కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా వెంట రాగా సోనియా గాంధీ ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి వెళ్లారు.కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని రెండు రోజుల్లో దాదాపు 55 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. రాహుల్ గాంధీని అడిగిన ఇలాంటి ప్రశ్నలే ఆమెను అడిగారని తెలుస్తోంది.

Rahul Gandhi: పోలీసులు అదుపులో రాహుల్ గాంధీ.. కీలక నేతల అరెస్ట్

త‌మ కార్యాల‌యానికి వ‌చ్చిన సోనియాను మ‌ధ్యాహ్నం దాకా విచారించిన ఈడీ అధికారులు ఆమెకు మ‌ధ్యాహ్న భోజ‌న విరామం ఇచ్చారు. అనంత‌రం విచార‌ణ‌ను కొన‌సాగించిన అధికారులు… నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై ప్రశ్నలు సంధించారు. సాయంత్రం 6 గంట‌ల దాకా విచార‌ణ కొన‌సాగ‌గా… 6 గంట‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌వారం నాటి విచార‌ణ ముగిసిన‌ట్లు అధికార‌లు ప్రక‌టించ‌డంతో సోనియా ఈడీ కార్యాల‌యం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. రేపు కూడా విచారణకు రావాలని సోనియా గాంధీకి ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ ముగిసే వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. సోనియాగాంధీ విచారణ ముగిసిన అనంతరం రాహుల్‌తో సహా వివిధ పోలీస్‌ స్టేషన్ల నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు.