Sonali Bendre: చిక్కుల్లో బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ.. సివిల్ కోర్టులో రైతు తీవ్ర ఆరోపణలు
- చిక్కుల్లో బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ
- సివిల్ కోర్టులో రైతు తీవ్ర ఆరోపణలు
- ఆరోపణలు ఖండించిన బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ చిక్కుల్లో చిక్కుకుంది. తమ భూమిని సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్ అక్రమంగా ఆక్రమించుకున్నారని రైతు చంద్రకాంత్ షిండే సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. అంతేకాకుండా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
ఏం జరిగిందంటే..
పుణె జిల్లా మావల్ ప్రాంతానికి చెందిన రైతు చంద్రకాంత్ షిండే తమ కుటుంబానికి 1957 నుంచి వారసత్వంగా వస్తున్న సుమారు 30 గుంటల భూమిని సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బేహల్ అక్రమంగా కొనుగోలు చేశారని అన్నదాత ఆరోపించాడు. గోల్డీ బేహల్ అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. తమ హక్కులను పట్టించుకోలేదని బాధిత రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ చంద్రకాంత్ షిండే వడగావ్ మావల్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిలో అక్రమంగా నిర్మాణం కూడా చేస్తున్నారని ఆరోపించాడు. భూమి ఆక్రమించుకోవడమే కాకుండా తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
Also Read
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Explainer: వి*షం తింటున్నాం...! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
సోనాలి బెంద్రే వివరణ
అయితే రైతు చేసిన ఆరోపణలను సోనాలి బెంద్రే, ఆమె న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. భూమి కొనుగోలు పత్రాల్లో తన పేరు ఎక్కడా లేదని తెలిపారు. ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, డబ్బులు కోసమే ఇదంతా దుర్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నటి తరఫు న్యాయవాది రాజు షిండే మాట్లాడుతూ.. ఇదే అంశంపై రైతు గతంలో తహసీల్దార్, సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గర పలుమార్లు ఫిర్యాదులు చేశారని, అవన్నీ కొట్టివేశాయని గుర్తుచేశారు. కేసును విచారించిన న్యాయస్థానం.. సోనాలి బెంద్రే, గోల్డీ బేహల్తో పాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!