NTV Telugu Site icon

Odisa: ఛీ.. ఛీ.. వీడు అసలు మనిషేనా? కన్నతల్లి అని చూడకుండా దారుణం..

Odisa

Odisa

కన్నతల్లి అంటే కనిపించే దేవత.. బంగారు పల్లకిలో కాకపోయిన భాధ పెట్టకుండా చూసుకోవడం బిడ్డల బాధ్యత.. అలాంటి కన్న తల్లిని ఓ మానవత్వం లేని మృగం అష్ట కష్టాలు పెడుతున్నాడు.. చిన్న దొంగతనం చేసిందని కరెంట్ స్తంబానికి కట్టేసి దారుణంగా కొట్టాడు.. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఈ అవమానీయ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళితే.. ఒడిశా కియోంఝర్​ జిల్లాలోని సరస్పాసి అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఓ 70ఏళ్ల శుభద్రకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆమె భర్త 10ఏళ్ల ముందే మరణించాడు. అప్పటి నుంచి.. ఆ వృద్ధురాలు, తన పెద్ద కుమారుడు కరుణతో కలిసి జీవిస్తోంది. చిన్న కుమారుడు శత్రుఘన్​.. తన భార్యతో కలిసి వేరుగా జీవిస్తున్నాడు.. రెండో కొడుకు పొలం ఉంది.. అతను కాలిప్లవర్ లను పండిస్తుంటాడు.. ఈ మధ్య కొన్ని కాలి ఫ్లవర్ లను ఎవరో దొంగిలించారు.. ఆ పని చేసింది తన తల్లే అని అనుమానించాడు..

వాటిని దొంగలించి, తినేసిందన్న కోపంతో.. ఆమెపై దాడి చేశారు. తొలుత ఆ వృద్ధురాలిని స్తంభానికి కట్టేశాడు. అనంతరం ఆమెను దారుణంగా కొట్టాడు. ఆమె బాధను చూసి విడిపించేందుకు వచ్చిన స్థానికులను కూడా బెదిరించాడు.. మొదట భయపడిన వాళ్లు ఆ తర్వాత ధైర్యం చేసి ఆమెను విడిపించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. ఆ పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని తెలుస్తుంది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.. ఈ దారుణానికి పాల్పడిన అతన్ని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు..