Snake-bite scam: ‘‘పాముకాటు కుంభకోణం’’.. 47 మందిని 280 సార్లు చంపారు..
- మధ్యప్రదేశ్లో ‘‘పాము కాటు కుంభకోణం’’..
- 47 మందిని 280 సార్లు చంపేసిన అధికారులు..
- ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake-bite scam: మధ్యప్రదేశ్ లో ‘‘పాము కాటు కుంభకోణం’’ వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో 47 మంది మరణిస్తే, ఏకంగా 280 సార్లు మరణించారని ప్రకటించారు. ప్రతీసారి రూ. 4 లక్షలను ప్రకృతి వైపరీత్య సహాయాన్ని పొందారు. ఫలితంగా మొత్తం రూ. 11 కోట్ల 26 లక్షల అవినీతి జరిగింది. రెవెన్యూ అండ్ అకౌంట్స్ విభాగం దర్యాప్తులో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 37 మందిని నిందితులుగా చేర్చారు. ప్రధాన నిందితుడితో సహా 20 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఈ స్కామ్ గురించి పరిశీలిస్తే, ఉదాహరణకు ద్వారకా బాయి అనే మహిళ పాముకాటులో మరణించింది, ఆమె పేరుతో అధికారులు 29 సార్లు చనిపోయినట్లు ప్రకటించారు. ప్రతీసారి ఈమె పేరుతో రూ. 4 లక్షల సహాయ మొత్తాన్ని రాబట్టారు. ఇలా ఈ ఒక్క మహిళ పేరు మీదనే రూ. 1 కోటి 16 లక్షలు మోసం చేశారు. ఇలాగే శ్రీరామ్ అనే వ్యక్తి విషయంలో, ఆయన 28 సార్లు మరణించినట్లు ఫేక్ ఆధారాలు సమర్పించారు.
Also Read
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
Read Also: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేసు.. ఆమెకు స్పాన్సర్ చేసిన సంస్థతో అజర్ బైజాన్ ఒప్పందం..
ఇలా ఈ నిధుల దుర్వినియోగం 2019-2022లో జరిగాయి. నవంబర్ 2022లో రెవెన్యూ ఆడిట్లో సంఘటన వెలుగులోకి వచ్చింది. పాము కాటు, నీటిలో మునిగి మరణించడం వంటి సంఘటనలకు గానూ సహాయ మొత్తాన్ని అందిస్తారు. దర్యాప్తు తర్వాత, రూ. 11 కోట్ల 26 లక్షలు దుర్వినియోగం అయినట్లు, 47 మంది ఖాతాలకు ట్రాన్స్ ఫర్ అయినట్లు కనుగొన్నామని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారి రోహిత్ సింగ్ కౌశల్ చెప్పారు. అయితే, నకిలీ పత్రాలను ఉపయోగించి ఎవరి పేర్లపై ఈ మొత్తాలు పొందారు, వారు నిజంగా బతికి ఉన్నారా..? చనిపోయారా..? అనే విషయం కూడా తెలియదని, చాలా సార్లు అడిగినప్పటికీ పోస్టుమార్టం నివేదికలు, డెత్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని చెప్పారు. దీనిపై సియోని కలెక్టర్కి నివేదిక పంపినట్లు చెప్పారు.
కియోలారి తహసీల్ కార్యాలయంలో క్లర్క్గా పనిచేసే సచిన్ దహాయత్ ఈ మొత్తం స్కామ్లో కీలక నిందితుడని తెలిసింది. పాము కాటు, నీటిలో మునిగిపోవడం, పిడుగుపాటు వల్ల మరణించిన వారి సంఖ్యను చూపించి 280 మంది పేరిట మంజూరు చేసిన మొత్తాన్ని అతను తన బంధువులు, పరిచయస్తుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడిని సర్వీసు నుంచి తొలగించారు. ఈ కేసులో పలువురు తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలని నివేదిక సిఫారసు చేసింది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
-
Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
-
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
-
Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!