Army Chief: సరిహద్దులో చైనా బలగాలు పెరిగాయి.. అన్నింటికి సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Army Chief General Manoj Pande: లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి చైనా బలగాల్లో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాల సంఖ్య స్వల్పంగా పెరిగిందని.. వారి కదలికను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. చైనా బలగాల కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. చైనాతో ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చైనాను ఉద్దేశిస్తూ.. ఉత్తర సరిహద్దు వద్ద ఎల్ఏసీని మార్చేందుకు ప్రయత్నించిన అన్ని చర్యలను భారత ఆర్మీ తిప్పికొట్టిందని అన్నారు.
Read Also: KL Rahul – Athiya: కేఎల్ రాహుల్, అథియా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఈ నెల్లోనే!
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ బాగానే ఉందని.. ఉగ్రవాద కార్యకలాపాలు, మౌళిక సదుపాలకు పాకిస్తాన్ మద్దతు ఇప్పటికీ కొసాగుతుందని.. అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ..‘‘ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) గత ఐదేళ్లులో ఉత్తర సరిహద్దు వెంబడి 2,100 కిలోమీటప్ల రోడ్డు, 7450 మీటర్ల వంతెనలను నిర్మించిదని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు వద్ద కొన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు.
తూర్పు లడఖ్ సెక్టార్ లో 500 ట్యాంకులు, 400 తుపాకులను మోహరించామని వెల్లడించారు. 55,000 సైన్య ఉండేలా మౌళిక సదుపాయలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాల్లో శాంతి నెలకొందని ఆయన అన్నారు. జనవరి 15న ప్రతీఏడాది జరుపుకునే ఆర్మీ డే ప్రత్యేకమైందని అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినందుకు ఈ సారి ఆర్మీడే చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఆర్టిలరీలో త్వరలో మహిళా అధికారులను నియమించవచ్చని జనరల్ పాండే చెప్పారు, ఆ మేరకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?