Sidhu Moose Wala: పంజాబీ సింగర్ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సిద్ధూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ.. రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకి తావిస్తోంది.
కాగా.. సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభ్దీప్ సింగ్ సిద్ధూ! తుపాకులు, గ్యాంగ్స్టర్లు వంటి హింసను ప్రేరేపించేవి ఇతని పాటల్లో ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇతను వివాదాస్పద గాయకుడిగా గతంలో వార్తల్లో నిలిచాడు. ఇతను పాడిన బింబిహ బోలే, 47 పాటలు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్ వంటి సినిమాల్లో నటించిన ఇతనిపై.. 2020లో లాక్డౌన్ విధించినప్పుడు ఫైరింగ్ రేంజ్లో ఏకే-47 రైఫిల్ని ఉపయోగించినందుకు కేసు నమోదైంది. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధూ.. తాజా ఎన్నికల్లో పంజాబ్లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆప్ అభ్యర్థి డా. డిజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయారు.
Also Read
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
గత నెలలో సిద్ధూ రిలీజ్ చేసిన ‘స్కేప్గోట్’ పాటలో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని మద్దతుదారుల్ని టార్గెట్ చేశాడు. అందులో ఆప్ సపోర్టర్స్ని ‘ద్రోహులు’గా పేర్కొన్నాడు. ఆ పాట తీవ్ర దుమారం రేపింది. ఆప్ వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. సిద్ధూ హత్యపై రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రతిభావంతుడైన సిద్ధూ హత్య విషయం తెలిసి తాను తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యానని అన్నారు. అటు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
తాజావార్తలు
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్లోపు కొనేయండి..
-
Rohit Sharma: వయసు పెరిగినా జోరు తగ్గలేదు.. రికార్డుల పుస్తకాల్లోకి మరోసారి ‘హిట్ మ్యాన్’..
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
-
Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!