Sidhu Moose Wala: పంజాబీ సింగర్ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సిద్ధూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ.. రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకి తావిస్తోంది.
కాగా.. సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభ్దీప్ సింగ్ సిద్ధూ! తుపాకులు, గ్యాంగ్స్టర్లు వంటి హింసను ప్రేరేపించేవి ఇతని పాటల్లో ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇతను వివాదాస్పద గాయకుడిగా గతంలో వార్తల్లో నిలిచాడు. ఇతను పాడిన బింబిహ బోలే, 47 పాటలు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్ వంటి సినిమాల్లో నటించిన ఇతనిపై.. 2020లో లాక్డౌన్ విధించినప్పుడు ఫైరింగ్ రేంజ్లో ఏకే-47 రైఫిల్ని ఉపయోగించినందుకు కేసు నమోదైంది. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధూ.. తాజా ఎన్నికల్లో పంజాబ్లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆప్ అభ్యర్థి డా. డిజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయారు.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
గత నెలలో సిద్ధూ రిలీజ్ చేసిన ‘స్కేప్గోట్’ పాటలో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని మద్దతుదారుల్ని టార్గెట్ చేశాడు. అందులో ఆప్ సపోర్టర్స్ని ‘ద్రోహులు’గా పేర్కొన్నాడు. ఆ పాట తీవ్ర దుమారం రేపింది. ఆప్ వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. సిద్ధూ హత్యపై రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రతిభావంతుడైన సిద్ధూ హత్య విషయం తెలిసి తాను తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యానని అన్నారు. అటు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!